పుట:Delhi-Darbaru.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

231

ఫ తే సిం గు...


కును ననఁగా పీష్వాకును ఆంగ్లేయులకును మఱల విగ్రహము ప్రారంభమయ్యెను. అందు గాయిక వాడు మహారాష్ట్రులఁ జేరు వాఁడేగాని కర్న లుగా డ్డార్డు గాయిక వాడు రాజ్యమును ఆధార భూమి (base of operation) గఁ జేసికొనుట యావశ్యకమని తలంచి బొంబాయిలోని సైన్యములను జేర్చుకొని యక స్మాత్తుగ దాభాయిని గొని బరోడాకుఁ బోయి చేరుటవలన గాయిక వాడు నానాఫడ్నవీసు పలు తెఱంగుల వేడుచున్న ను నాతనివిడిచి ఆంగ్లే యులకు సాహాయ్యుఁడు గావలసివచ్చెను. 1780 వ సంవత్సరము జనవరి నెల 26వ తేది ఫతేసింగునకును ఆంగ్లేయనర్తక సంఘము వారికిని కండీలాగ్రామమునద్ద సంధి జరిగెను.;

ఈసంధివలన పీష్వాకు గుజరాతు నందుండిన భాగము ఆంగ్లేయులకుఁ జేరిపోయెను. గాయిక వాడు గుజరాతు నందు దన భాగమున స్వతం పరి పాలకుఁ డయ్యెను. . ఇట్లు. పంచుకొనుటలో సౌకర్యముకోఆకుఁ గొన్ని ప్రదేశములు మార్చుకొనఁబడెను. అందుచే ఫతేసింగు నకు అహమ్మదా బాదు మున్నగునవి దొరకెను. ఆంగ్లేయులకు మాహికి దక్షిణ మందుండిన పీష్వా యొక్క భూభాగము చెందెను. గాయిక వాడు పీష్వాకు చెల్లించు చుండిన కప్పమియ్యక తిరస్కరించు టలో నాంగ్లేయులు దోడ్పడ నొప్పుకోనినందున వారీ కాతఁడు జిన్నూరు జిల్లాయును బ్రోచికి సంబంధించిన మఱికొన్ని గ్రామ ములును శాశ్వతముగ దానము చేసెను. వారును అతఁడును