పుట:Delhi-Darbaru.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2:28

బ రో డా రాష్ట్రము.


నికి సాహాయ్యము వచ్చినందున విఫలమనోరధులయి వదలిచనిరి.. నాఁటినుండి ఫతేసింగు పునహామంత్రుల పరమున సంగరరంగమున మహాశూరుఁడయి తన యావచ్ఛక్తినిజూపదొడఁగెను. పునహా బలము లాంగ్లేయులకు నిలువ లేక అనేక పర్యాయములు విజయ మందకపోవుట సత్యమేకాని ఆంగ్లేయ సైన్యములు మాత్రము రఘునాథరావు యొక్కయు గోవిందరావు యొక్కయు పిచ్చిపటా లములు బరువై వ్రేగుటవలన గొప్పనష్టముల నందెను. గుజరాతు నందు జరుగుచుండిన విగ్రహము 1775 సంవత్సరము మే నెల కడ పటి దినములలో సమాప్తి నొందెనని చెప్పవచ్చును. అప్పటికి ఫతే సింగు బరోడాయుదు సర్వస్వామిగనుండె. గోవిందరావు ఆంగ్లే యగుకర్నల్ - కీటింగుతోఁగూడ దురవస్థ లందుచుండెను. అట్టి య సేనాని సమయమున గోవిందరావు కర్నలు కీటింగును బరోడా ముట్టడించి తనవశము చేయవలసినదని యడిగెను. అయిన ఫతేసిం గు చాతుర్యము లేనివాడు కానందున నాతఁడు శత్రుగణము లోని వాడయినను అదివఱకె ఆంగ్లేయులతో మైత్రి గడింపఁ బ్రయ త్నించుచుండెను.

ముట్టడించి బరోడాను గొనవలసిన గోవింద రావునకుఁ దోడ్పడుట కంటె బరోడాను సర్వస్వాధీనమున నుంచుకొనిన ఫతేసింగుతో స్నేహము కుదుర్చుకొనుట దుర్దశల పాలగుచుం డిన రఘునాథ రావునకును కర్నలు కీటింగునకును లాభకారిగఁ దోఁచెను. కావున వారు గోవిందరావు నట్టెవదలి ఫ తేసింగుతో