పుట:Delhi-Darbaru.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయాజిరావు I.

227


గలుగఁ జేసికొననందున నితఁడును గోవిందరావును గొంతకా లము . ఒక్కరితో నెక్కరు ఒంటరిగ పెనఁగులాడు చుండిరి. ఇట్లుండ పుసహాయందు నవీనములగు విశేషములు చూప ట్టెను.పీష్వామాధవరావు 1772 వ సం|| ననంబరు నెలలో మృతుఁ డయి యుండెను. ఆతనిసోదరుఁడు నారాయణరావు 1773 లోఁ జంపఁబడెను. ఈయల్లకల్లోలములలో రఘునాథరావు గద్దెనాక్ర మించుకొనియె. అతఁడు 1778వ సంవత్సరాంతమున సయాజిరా వును సేనాఖాన్ ఖేల్ పట్టమునుండి తొలగించి తనకుఁ బూర్వ స్నేహితుఁడగు గోవిందరావు కద్దానిని మఱలించెను. గోవిందరావిట్లు పీష్యాగారియను గ్రహమువడసి వెడలివచ్చి 'సోనఘడును" ముట్టడించి స్వాధీన పజచుకొనెను. ఈలోపుగ మృతినొందిన మాధనరావున కొక చిన్ని కుమారుఁడు 'పుట్టుటయు పునహా యందు రెండుకక్ష లేర్పడెను. రఘునాధరావాచిన్ని కుమారుని సింహాసనార్హుఁడుగ నంగీకరింపనందున నానాఫడ్నవీసు ముఖ్యుఁ డుగ మంత్రు లెల్లరును రఘునాథరావుపై వైరమూని అతనిని పున హానుండి వెడలఁ గొట్టిరి. అతఁడు బొంబాయిలోని ఆంగ్లేయ ప్రభు త్వము వారిని సాయము చేసికొని నానాఫడ్న వీనుతోఁ బెనఁగ సమక ట్టెను. గోవిందరావు ఫతేసింగు లిరువురును అతనికి సాహా య్యమువత్తురను వార్తయుండెనుగాని తుట్టతుదకు గోవింద రావుమాత్ర మతనింజేరెను. గోవిందరావు రఘునాధ రావులు ఫ తేసింగును బరోడాయందుముట్ట డించిరిగాని పునహానుండి యత