పుట:Delhi-Darbaru.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దామాజి II

221



సంవత్సరములో సేనాపతి యశ్వంత రావు యొక్క ప్రతినిధి యగుటవలన , ' పీష్వా ఇతనిని గుజరాతునం దర్థ భాగ మియ్యవలసినదని కోరెను. ఆయుత్తరువు - నీతఁడు. దిరస్కరించెను. ఆ సంవత్సరమే తారాబాయ శివాజి సంతతి వాఁడును దన మనుమఁడును నగు సతారారాజును మహారాష్ట్ర దేశముతోఁ గూడ పేష్వాల చేజనుండి తప్పించ వలసినదని ఇతనికి నుత్తరు విచ్చెను. ఆముడల ననుసరించి ఇతఁడు 15,000 సైన్యముతో 'సోనఘడును' వదలి పయనమయి మార్గమున నెదురువడిన గొప్పదండు నొక దానీని ఓడించెను. కానిపీష్వా బలములతోఁ బోరుసమయమున నీతఁడు వానిచేఁ బూ ర్తిగఁ జుట్టఁబడుట వలన సంధిఁ జేసికొన నిష్టము సూ పెను. పీష్వాఆలోచన సల్పుచుండినట్లు నటించి మోసపుచ్చి ఇతనిని బట్టుకొని పునహా నగరమునఁ గారాగృహ మందుం చెను. అటు తరువాత పీష్వా గుజరాతును మొగలాయీలనుం డియు దామాజిపక్షము వారినుండియు లాగుకొనఁ జూచెనుగాని అతనికది సాధ్యము కాదయ్యె. కావున నతఁడు దామాజితో స్నే హపుమాటల నడ పెను. చేయునది లేక దామాజి పీష్వాకు గుజ రాతునందు సగపాటు నిచ్చి వేయునట్లును ముందు తాను జయించు భూభాగములలోగూడ నర్థభాగము పీష్వాకు . చెందునట్లును, నిబంధ నలొనర్చు కొనెను. ఇంతియ కాక వలసినప్పుడు పీష్వాకు ' ' సాహాయ్య మనుషఁ దాను 10,000 సైన్యమును సిద్ధముగ నెల్లపు