పుట:Delhi-Darbaru.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ సాలార్జంగు.

197


రాను ఆవ్యాధి తీవ్రమయి 8 వ తేదీ సాయంత్రము 5 గంటలకు ప్రజలను ప్రభువులను దుఃఖాబ్ధిలో ముంచి మహాసర్ సాలారును భరతవర్షపు నుత్తమ పుత్రులలో నగ్రగణ్యుని మ్రింగి వేసెను.

రెండవసాలార్జంగు.

అతనికి ఇద్దఱు పుత్రులును నిద్దఱు పుత్రికలును నుండిరి. అందు రెండవసాలారుజంగు "మొదటివాఁడు. తండ్రిమరణా నంతరమితఁడు రాజానరేంద్రప్రసాదుతో గూడ సహపాలకు డుగ నేమింపఁ బడెను. 1884వ సంవత్సరమున నైజాము మీరు మహబూబ్ ఆలీఖానుఁడు దీపక్ ప్రభువు చే సంపూర్ణ శక్తులతో బరిపాలకుఁడుగఁ బ్రకటింపఁ బగుట తోడనే రెండవ సాలారు ముఖ్యమంత్రిగ నియమింపఁబడెను.

మీర్ మహబూబ్ మంచి విద్యావంతుఁడు. అతని బాల్యమునందు మహాసర్ సాలారుజంగు అతనికి రాజ్యాంగ విషయములయందొ క్కొక్కటి ని జక్కఁగ నేర్పి విద్యా లయములయందును పరిశ్రమాగారముల యందును అభిమాన మును ' బుట్టించి యుండినందున నతఁడు రాజ్యభారమును నిర్వహించుటకుఁ దగిన శిక్షునంతయు గనియుండెను. కావున నతఁడు గద్దె నధిష్టించిన తరువాత హైదరాబాదు రాష్ట్ర మున సర్ సాలారుజంగు ప్రారంభించిన సంస్కారములు బాగుగ నభివృద్ధి చెందఁ జొచ్చెను. విద్యాలయములు గట్టింపఁబడెను. యంత్రశాలలు నిర్మింపఁ బడెను. గొప్ప సంతతులకుఁ జేరిన