పుట:Delhi-Darbaru.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

హైదరాబాదు సంస్థానము.


'పైయను వాదమునందె సర్ సాలారు ఇంగ్లాండునకు వెడలినట్టు వ్రాయఁబడియెనుగదా! అప్పు డతఁడచ్చట గనిన స్వాగత వైభవమే యతనికిని ఆంగ్లేయులకునుగల యన్యోన్య ప్రేమానురాగమును వెల్లడింపఁజాలియుండెను. ఇంగ్లండున ప్రతి నగరమువారును అతనిని రమ్మనిచీరుచు ఏదోయొక మహాచక్రవర్తి కింబలె అతనికి సంపూర్ణ గారవమును జూపిరి. అతనికారోగ్యము దప్పినందుననొకటి రెండు నగరముల కతఁడు దర్శనమిచ్చుటకుఁ గూడవీలు లేకపోయెను. అతనిని సమానముగ సన్మానించిన వారలలో ఇటలీ దేశోద్ధారకుఁడును 'రాజునుసగు విక్టరు ఇమా న్యుయెల్ ను, రోమునందలి మహామతాచార్యులును, ఆంగ్లేయ చక్రవర్తిత్వమునకర్హుడగు వేల్సు ప్రభువును నుండిరనిన సర్ సాలారునకు జరిగిన గౌరవాదరణలు విశదముగాఁ గలవు. అతఁడు నాలుగుమాసముల కాలమిట్టివిధమున యాత్రనడపి 1876 వ సంవత్సరము ఆగస్టు నెల 25 వ తేది హైదరాబాదు వచ్చి చే రెను. ఆడిశెంబరు నం దె 1877 వజన వరిలో జరుగనున్న చక్రవ ర్తిని దర్బారునకి భిముఖుఁడై నైజాముగారితోఁ గూడ ఢిల్లీ కే గెను. 1888వ సంవత్సరమున నైజూముగా రైరోపాకుయాత్ర వెడలుట నిశ్చయింపఁ బడెను. దానికై సర్ సాలారు ఉచిత మగు రీతిని ఏర్పాటులు చేయుచుండెను. ఫిబ్రవరి 5 వ తేది రాత్రి పండ్రెండు గంటల వఱకు అభ్యానరీతిని పనిచేసి పఱుం డెను. రెండు గంటలగునప్పటికి అకస్మాత్తుగ నతనికి కలరా దగిలెను.రాను