పుట:Delhi-Darbaru.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

హైదరాబాదుసంస్థానము,


1862లో నొకటియుఁ దటస్థించెను. రెంటను సర్ సాలారు విజ యుఁడయ్యెను. అయినను అతని పై వ్యతి రేక భావమును బుట్టించు ప్రయత్న ములంతటితో పోలేదు. నైజాము పూర్వాచారపరా యణుఁడు. సంస్కారముల ననుమానముతోఁ జూచువాఁడు. సర్ సాలారుజంగన్ననో సంపూర్ణసంస్కార పరుఁడు. నవీన పద్ధతుల నుపక్రమించువాఁడు. కావున వీరిరువురకును ఎంత యన్యోన్య ముండినను వైషమ్యము గలిగించుట దుష్టబుద్ధులకుఁగష్టము కాదు. అందువలననే మరల మరల నైజామునకుఁ దనముఖ్యముత్రి పై సందేహముగలుగుచుం డెడిది. 1861వ సంవత్సరముననే సర్ సాలారు ఆంగ్లేయపక్ష పాతియనియు నైజామును ముంచి వేయ నున్నాఁడనియు నాంగ్లేయ వర్తక సంఘమువారి దయను సంపా దింప సమకట్టినాఁడనియు సర్ సాలారును దూలనాడుచు పత్రికలు వ్రాసి నైజాముగారి నగరులోను మసీదులలోను వంతెనల మీఁదను నగరద్వారమునను అతికించియుంచి రనిన సాలారు జంగు సంస్కారముల వలన దమ దుర్గాములు నెఱ వేరక పోవుట చేనతనికి శత్రువులయిన దుష్టులు మొదటినుండియు నతనిమీఁదఁ బ్రయోగింపఁ దొరకొనిన సాధనములిట్టిపని తెల్లముగాఁ గలదు. 1869వ సంవత్సరమున సర్ సాలారు నైజాము గారికొలువు కూటమున కేగు చుండగా దారిలో నాతనిని - జంపి వేయుటకుఁ గొందఱు ధూర్తులు ప్రయత్నించిరి. కాని లోక పరిణామ ప్ర వాహమునకు సోలారు జంగింకనుగొంత దోడ్పడవలసిన వాడ