పుట:Delhi-Darbaru.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

హైదరాబాదు సంస్థానము.



యుండెను. బీరారుమండలముయొక్క యాదాయముమాత్రమె అవ్యయమునకు వలసిన ద్రవ్యమును సమకూర్చు టేగాక ఇంకను ఎక్కుడుధనము నిచ్చుచుండెను. భారతవర్ష మునందు (స్వదేశ ప్రభువుల చే నాంగ్లేయులకు) ఒప్పగింతలు చేయఁబడిన ప్రతి మండల విషయమునను ఒప్పగించు నెడ వేయంబడు వరుంబడి లెక్కలు మిక్కిలితక్కువగ వేయఁబడుటయు, ఒప్పగింత జరిగిన నెంటనే సర్వే సెటల్ మెంటులు నడుపఁగాఁ దన్మూలమున ఛపా వణిసాగు విశేషము బయల్పడుటయు సర్వసాధారణములు, కాఁబట్టి రాయచూరు ముడలము 1858 వ సంవత్సరపు సంధి. షరత్తుల పూరీకరణమునకు అనవసరమయియుండెను. అందుచే నాస్వల్ప భూభాగమును నైజామునకు మరల్చట న్యాయాను కూలము. మాత్రమె.

““ 1853 వ సంవత్సరపు సంధి ననుసరించి మనకు నొప్పగింపఁబడిన సీమలవరుంబడిలో ప్రతి సంవత్సరమును నిలు వకాఁ గలుగు ద్రవ్యమును ఏయప్పుదీర్ప వినియోగింపవల . సినదని నిర్ణయింపఁ బడియుండెనో ఆ ఏబదిలక్షలఋణమును మన్నించి రద్దుపఱచితిమి. ఈ కార్యముమనము నైజామున కౌదా ర్యము సూపితిమని దక్పక తోపింపఁ జేయుచున్నది. కాని కొన్ని విషయములను మనము మఱువక జ్ఞాపకమునకు దెచ్చుకొనవ లె ను.మనకొప్ప గించబడిన సీమలుమన పారిపాలన క్రింది వచ్చియుం డిన ఏడుసంవత్సరములుగ, సంధి ననుసరించి ప్రతి సంవత్సరమును..