పుట:Delhi-Darbaru.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హైదరాబాదు సంస్థానము:

178


ఈసందర్భమున రెసిడెంటునైజాము సైన్యమును గూడ మిక్కిలి చాతుర్యముతో నుపయోగించుకొనెను. హైదరాబా దునందా సైన్యమును నిలువనిచ్చినచో నుద్యోగ రాహిత్యమున నది ఏవేనియల్లరులకు మూలము గావచ్చనని తలంచి యద్దానిని ఉత్తర హిందూస్థానమున విప్లవకారుల నణచుటకై ఆయత్త పఱచి పంపి వేసెను. అచ్చట నీ సైన్యము ఆంగ్లేయులకు మ హూ' పకార మొనర్పఁగలిగెను. ఈ ప్రకారము ప్రాణము దీసెదమని ప్రతిపక్షులు పలుమారు జంకించుచుండినను వెనుదీనుక వైజా ముగారును నైజాముగారి ముఖ్యమంత్రియును, మహావిప్లవము జరుగుచుండు నెడకుఁ దరలి పోయి యుద్ధరంగమున నెనుకంజ వేయక నిలిచి నైజాముగారి సైనికులును, ఈవిపత్సమయమున నాంగ్లేయ ప్రభుత్వము వారికి ఉత్కృష్ట సాహాయ్యం బొనర్చిరి.

ఏప్లవ విచ్ఛేదనా ఫలితములు.

ఇట్లు సాలార్జంగు కలహ కారుల నిర్మూలించుట నలన గొందరికి కష్టముగా నుండెను గాబోలు. దీనివలననె తిరుగుబాటంతయు నణఁగిపోయిన తరువాత 1858న సంవత్సర మున ఒక విప్లవపక్ష పాతి సర్ సాలారు జంగును రెసిడెం టును గలిసిపోవుచుండ వారిరువురి పై గుండు పాఱించెను. దైవవశమునసది వీరికి తాకినది కాదు. హత్యను ప్రయత్నిం చిన ఆదురాగతుఁ డచ్చటనే మంత్రి యనుచరులచే ఖండిం పఁబడెను. 1861 వ సంవత్సరమున నైజముయొక్క యు సర్ సా