పుట:Delhi-Darbaru.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

హైదరాబాదు సంస్థానము.



టుగానుండిన కర్నల్ డేవిడుసన్ అనునతఁడు గనర్నరుజనరలు గారికి వ్రాసెను. ఈగడబిడలు జరుగుచుండఁగ నే నైజాము నాజర్ ఉన్ రౌలా మృతి నొందెను. అతనికుమాఁగుడగు అఫ్ జుల్ . ఉద్ దౌలా నై జూముపట్టమునకు వచ్చెను.

మహావిప్లవవిచ్ఛేదనము.

అఫ్ జుల్ - ఉద్ధాలా సింహాసన మెక్కునప్పటికి దేశమంత యును ఆంగ్లేయుల పై తిరుగుబాటులతోడను తిరుగు బాటుల వార్తలతోడనునిండియుండుట ఇదివఱకు వ్రాయఁబడిన అంశము లను బట్టియే విశదముగాఁ గలదు. . క్రొత్తనై జాము గద్దెనెక్కిన కొన్ని గంటలలో ఢిల్లీ నగరము తిరుగుబాటు సేనలచేఁ జిక్కె ననువార్తనచ్చెను. హైద్రాబాదు నందును తిరుగుబాటుపరమున నుత్సాహము మెండుగ నుండెడిది. ఔరంగా బాదునుండి హైద రాబాదునకు వచ్చి చేరియుండిన యిద్దరు తిరుగుబాటు సైని కులను సర్ సాలారుజంగు బందీక రించి ఆంగ్లేయులకు ఒప్ప గించినందున అచ్చట నల్లకల్లోలము ప్రారంభమాయెను. తుదకు రెసిడెంటుగా రుండు ప్రదేశము తిరుగుబాటు లచే ముట్టడింపఁబడెను. కాని ముఖ్యమంత్రిగారి దూర దృష్టి వలన నిట్టి యుత్పాతముల నణఁచి వేయుట కదివఱ కే ఏర్పాటులు జరిగియుండెను. కావున తిరుగుబాటు హైద రాబాదునందు కొంచెమైనను .బలముతో నిలిచినది కాదు. దానికి ముఖ్య కారకులగు నిద్దఱును . పట్టువడిరి. . పారిపోవఁ