పుట:Delhi-Darbaru.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

హైదరాబాదు సంస్థానము.


మని, దృఢముగ రెసి డెంటు నైజూమున కెఱుక పరచి యుం డుట దనకు సమ్మత మేయని తెలిపెను. తరువాత గొంతకా లము వఱకును వివరింపవలసిన విశేషము లేమియు లేవు. 1852వ సంవత్సరము నవంబరు నెలలో రెసిడెంటు ఫ్రేజరు రాజీనామా నిచ్చెను. కర్నల్ లో అతని స్థానమున విచ్చే సెను. ఇతఁడు నైజాము సైన్యమునకుఁ బ్రతిమాసమును ఆంగ్లేయ ప్రభు త్వము వారిబొక్క సమునుండి యేజీతములిచ్చి. తీరవలసివచ్చెను. మూఁడు నెలలలో 1858వ సంవత్సరము మార్చిలోపల నైజూము గారి యప్పుమరల నలువదియైదులక్షలయి యుండెను. గవర్నరు జనరలుగారు : రెసిడెంటు నకు నైజూము యొక్క యంగీ కార మును స్వీకరించుటకయి క్రొత్తసంధినొకదానిని చిత్తువ్రాసి యంపిరి. కర్నల్ లో నైజామున కద్దానిని వినిపించి యతనితో జర్చింప నేర్పఱచు కొనెను. ఈసందర్భమున నైజామునకును అతనికిని కొంచెము కఠినమగు సంభాషణలును ఉత్తర ప్రత్యుత్త రములును నడవవలసివచ్చెను.

అప్పుడు రెసిడెంటు తెలియపఱచిన సంధిషరత్తులలో బీరారుమున్నగు ప్రదేశమును శాశ్వతముగ నాంగ్లేయ ప్రభు త్వమువారికి నైజాము ఇచ్చి వేయ వలయు ననునది యొక టి. రాజ్యములో "నేమాత్రమైనను ఇతరుల కిచ్చుటగాని ఒకప్పుడు తనకయి ధైర్యముతోఁ బోరాడిన బంటులను దనసామీప్యము నుండి తొలఁగించుటగాని ఱేనికి మహావమానకర కార్యములని