పుట:Delhi-Darbaru.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

హైదరాబాదు సంస్థానము.


యంగీకరించిరి. మెట్ కాఫ్ చే నియోగింపఁబడిన ఆంగ్లేయాధి కారులు దొలఁగింపఁబడిరి. నైజామునకు అంతఃపరి పాలనయందు సంపూర్ణ స్వాతంత్య మియఁబడెను. ఇట్టి స్వాతంత్యమును గోరుటకు నై'జామును బురికొల్పినవాఁడు అతని ముఖ్యమంత్రి యగు రాజాచందూలాలని తోచుచున్నది. అతఁడు మొదట సర్వస్వతంత్రుఁడై రాజ్యభారము నిర్వహించుచుండి మధ్య కాల మున మెట్ కాఫ్ ఏర్పాటునలనఁ గొం చెము శ క్తిహీనత నంది యుండెను. కావున మొదటి స్వాతంత్యమును సంపాదించుకొ నుటకు చందూలాలే నైజాము చేత నాంగ్లేయ ప్రభుత్వము వారిని ఆంగ్లేయాధి కారులఁ దీసివై చునదని యడిగిం చెనని కొందఱభి ప్రాయపడియున్నారు. ఎట్లైన నేమి ఆంగ్లేయాఛిధికారులు దమయా ధీనముననుండిన జిల్లాలను ముఖ్యమంత్రి కప్పగించి వెడలిపో యిరి. చందూలాల్ మరలఁ దన మొదటి యాచారములను విడు వక రాజ్యమును నడుప మొదలిడెను. మరల మునుపటి విధము ననెకస్టములు చూపట్టఁ దొడంగెను. గొప్ప గొప్ప జమీందారు లుగ నున్న వారి చర్యలుగూడ నా క్షేపణీయమయ్యెను. పన్ను వసూలు తగాదాలు మిక్కుటముగాఁ జొచ్చెను. 1835 న సంవ త్సరమున ఆంగ్లేయనర్తక సంఘపు డైరక్టర్లు గవర్నగుజనరలు గారికి “(నైజాము) రాజ్యములో బహు కాలముగ నెలకొనివచ్చు చున్న అల్లరులను, అరాజకమును దాము ఉదాసీనభావమునఁ