పుట:Delhi-Darbaru.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఋణవిమోచనము

151

.

కాఫ్ ను ఆంగ్లేయ ప్రభుత్వమువారు రెసిడెంటుగాఁ బంపిరి. అతఁ డాంగ్లేయాధికారులను జిల్లాల కధిపతులను జేసి, ఆయామం డలముల యందు మండలాధి కారులును గ్రామాధికారులును రైతులనుండి వసూలు చేసికొనవలసిన మొత్తములను నియ మించి న్యాయమగు కౌలులనియ్య నేర్పఱచెను. ఆంగ్లేయ మం డలాధికారులు గడచిన ఫలములను బట్టియు సాగగుచుండిన ప్రదేశమును బట్టియు 'సాగుకాఁగల భూభాగమును బట్టియు బన్నులను దీర్మానము చేసిరి. వీరుపక్రమించిన సంస్కారము లైదుసంవత్సరముల కాలము పరీక్షింపఁబడెను. వానివలన కౌ లుదారులకును రైతులకును నిరంతర మగుచుండిన కలహము లణఁగిపోయెను. పన్ను వసూలు చేయుటకై దండుల విడియించు నాచారము దప్పిపోయెను. " దేశము శాంతిమై వృద్ధిపొంద మొదలిడెను. రాజ్యాంగము పై ప్రతిసంవత్సరము రగులుకో నుచుండిన యసంతుష్టి పోయి యనురాగ ముత్పన్నము కాజొ చ్చెను.

ఋణవిమోచనము.

ఈసంస్కారములతో గూడ రెసిడెంటు హైదరాబాదు నైజాముగారి యప్పుల విషయమునందు శ్రద్ధఁ జేసి రాజ్యాంగ మునకు భరింపరాని ఋణముల బాధనుండి విమోచన మొసం గవలసివచ్చెను. బహుకాలముగ హైదరాబాదునందు స్థాపిత మయి యుండిన పాల్మరు కం పెనీ వారు నైజామునకు సంవత్స