పుట:Delhi-Darbaru.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

149.

చందూలాల్ ముఖ్యమంత్రిత్వము.


న్నారు. కావున నిఁక రోజు చందూలాల్ రెసిడెంటు గారె ట్లునడపిన నట్లు నడచెననినచో నతిశయోక్తిగ నుండఁజాలదు. రెసిడెంటును దరుణము చూచుకొని నైజాము స్వంత సైన్య' ములను సంస్కరించి విడిచెను. వాని పై నాంగ్లేయాధికారులు నియమింపఁబడిరి. ఆంగ్లేయుల ప్రతినిధియగు మంత్రి చేతులలో సర్వశక్తుల నిడుకొనుటవలన హైదరాబాదునకును ఆంగ్లేయ రాజ్య మండలములకును విశేష భేదము లేక పోయెనని తెలియఁ జేయు నంశములలో నిదియొకటని మాక్ ఔలిఫ్ అను చరిత్ర కారుఁడు వ్రాయుచున్నాఁడు. 1871 వ సంవత్సరమున పిండారీలతోఁ జేరుకొనిన మహారాష్ట్రులకును ఆంగ్లేయులకును మరల . విగ్రహము ప్రారంభమాయెను. దానిలో సంస్కారమందిన నైజూము. దండులు దీర్చినపనివలన వానిబల మిట్టిదిగదా యని బయ ల్ప డెను. ఆవిగ్రహము ముగిసి నాగ పురాధిపతియు హెూల్కా, రును పేష్వా బాజీరావును ' ఓడింపఁబడిన తరువాత 1822 న సంనత్సరమున హైదరాబాదు నైజామునకును నాంగ్లేయుల కును 'మఱియొక సంధిజిరిగెను. ఆంగ్లేయ ప్రభుత్వము వారు పేష్వాను జయించి యతని స్థానము నాక్రమించుటవలన నత నికి నై జూము గట్టుచుండిన చౌతుకప్పమును వీరికిని గట్టనలసిన వాఁడై నను ఈసంధివలన నది త్రోసి వేయఁ బడెను. ఇంకను మహారాష్ట్రులు నైజాము పై మోపుచుండిన మామూలు