పుట:Delhi-Darbaru.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

హైదరాబాదు సంస్థానము.


ర్యముతోఁ బని చేసి కర్ డ్లా సంధినలన నైజాము పోగొట్టుకొనిన సర్వసంపత్తును మహారాష్ట్రులనుండి వైజామునకు మరల్చు' టకుఁ దగిన ఏర్పాటులన్నియుఁబన్ని ,తన్ను వారువదలి పెట్టునట్లు వారితో స్నేహభావముగలించుకొని హైదరాబాదువచ్చిచే రెను. ఇతఁడాంగ్లేయుల పయిభ క్తియు వారియెడ ప్రేమయుఁ గల వాఁడు. కావున నైజామున కితఁడు నచ్చఁ జెప్పి రెండవమారు తిరు గఁ గొట్టఁబడనుండిన యాంగ్లేయ సైన్యములను హైదరాబాదు నందు నిలిపెను. రెసిడెంటుగా నుండిన కిర్కు పాట్రికు నైజాము నకునప్పటికాలమున ఫ్రాంసులో జరుగుచుండిన విప్లవమును గుఱిం చియు నట ప్రభువులు పడుచుండిన గొప్పదురవస్థలను గుఱించి యు ఫ్రెచి వారికి ప్రజాస్వాతంత్ర్యము నెడఁ గల యాపేక్షులను గుఱించియు సమయము దొరకనపు డెల్లా పెంచి చెప్పుచు వారియెడ నతని కసూయఁగలిగింపఁ బ్రయత్నించుచుండెను. నైజాము నకుఁగూడ ఫ్రెంచివారు రాజును విధ్వంసము చేసినది చూడ విస్మ యకరముగనె యుండెను. ఇంతియగాక 1796న సంవత్సరమున నైజాము మిక్కిలి జబ్బుపడి లేచి నాఁటినుండియు బలహీనుఁ డగుచు నేయుం డెను.

ఆంగ్లేయులతో సంధి (1798.)

ఇప్పగి దన్ని విషయములును నాంగ్లేయులకు సహ కారులుగనే కాన్పించెను. కావున గవర్నరుజనరలుగారు ఫ్రెంచి పటాలములను బగులఁగొట్టవలసినదని నొక్కి చెప్ప నారంభిం