పుట:Delhi-Darbaru.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

హైదరాబాదు సంస్థానము


కారు' లితని పైఁ బ్రేమగొనఁ జొచ్చిరి. 'కావున నితఁడు త్వర లోనే నాయకత్వమున కర్హతనం దెను. 1788న సంవత్సరమున నాంగ్లేయుల నెదుర్చుటలోఁ దోడ్పడ 'బుస్సీ' యేతించినపు డాతఁడితనిని దనపార్శ్వవ ర్తిగ నేమించుకొనెను. బుస్సీమరణా సంతరము 1786వ సంవత్సరమున నప్పటి పుదుచ్చేరి గవర్నరు గా రితనిని నైజామునకు మిక్కిలి నమ్మకమగు సేవకుఁడు గాఁగ లఁడని సిఫార్సు చేసిరి. నైజామును నితనికి మాసమునకు నైదువే లరూపాయిలు జీతమిచ్చి కాల్బలపుఁ బల మొక్కటిని పఱుప నియోగించెను.

ఇతఁడు చేర్చిన పటాలము నైజామదివరకును జూడ నైనఁ జూడనంతటి బలవంతమయినదయి కనుపట్టినందునఁ గ్రమ క్రమముగఁ బదునాల్గుపటాలములఁ జేర్చవలసినదని యితనికి నుత్తరువాయెను. ఇతఁడు బలములఁ జేర్చినదియు, మహా రాష్ట్రులతోఁ బోరినదియు, నైజాము యొక్క బలహీనతవలన విజయమును సంపాదింప లేకపోయినదియు సంతకుము న్నై వ్రాసితిమి.

ఇట్టి ప్రచండుఁడగు ఫ్రెంచి నాయకుని యాధిపత్యము క్రింద దినదిన ప్రవర్ధమానమగు సైన్యముండుటయు, నది నైజాము నకు దోడుగ నుండుటయు, నతనివద్ద చేరుకొని యాతనితో సంబం సములు గల్పించుకొనుచుండిన యాంగ్లేయులకు గిట్టినదిగాదు.