పుట:Delhi-Darbaru.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

హైదరాబాదుసంస్థానము.


గొంచెమైనను దెలుపక యే జజలత్ జంగు యొద్దనుండి యా "జిల్లాను గైకొనుట నైజామునకు నాగ్రహము పుట్టించుటకు గారణమయ్యెను. ఇట్టి సందర్భముల నతని కోపముగూడ న్యాయమయినదే. అతని కప్పుడు జరిగినది గొప్ప యన్యాయమ నుట నాగ్లేయ ప్రభుత్వమువారే తరువాత సిద్ధాంతీకరించి యక్కాలమున మద్రాసు గవర్నరుగా నుండిన సర్ థామస్ రంబోల్టు అను నతనిని పదవినుండి తొలఁగించుటయే గాక యతనితోఁ జేరియుండిన కొందఱు సభ్యులనుగూడ నదేవిధ మున శిక్షించిరి. ఇదంతయు నప్పటికప్పుడు జరిగినది కాదు. అల్లకల్లోలము లయిన తరువాత నింగ్లాండునందలి యధికారులు రహస్యసభ ఒక దాని నేర్పరచి ఆసభవారీ దేశమునకు వచ్చి జాగరూకతతో నన్ని విషయములను జర్చించి యనేకులగు సాక్షులను విచారించి తమ యభిప్రాయములను, "దెలిపినమీ దట నైజూము నెడ మద్రాసు ప్రభుత్వమునా రపరాధము చేసి రనుట తేలెను. కాని యీలోపుగ నైజామున కేలాటి సమా ధాసమును నీయఁబడ లేదు. కావున నతఁడు గోపోద్దీపితుఁడయి మరల, హైదరాలీతోఁ జేరుకొని ఆంగ్లేయులతోడి స్నేహము మాని వారిని బారదోల వలసినదని బజలత్ జంగుకు తెలియఁ జేయుచు, నతఁడట్లు చేయనియెడల దానతనిని మర్దించెద నని "కూడ జంకిం చెను. ఇంతలో గుంటూరు జిల్లాను గుఱించి మద్రా సు ప్రభుత్వము వారు చేసికొనిన ఏర్పాటులు బంగాళాలోని