పుట:Delhi-Darbaru.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

హైదరాబాదుసంస్థానము.


నే తనయన్నను జంపించి రాజధానియందుఁ దన యధి కార మును స్థిరపఱచుకొని కర్నాటకపు నవాబు దన్ను యజ మానిగ నొప్పుకోనునట్లు చేయును ద్దేశముతోఁ దీక్షణగతిఁ గర్ణాటకము పయికి దాడి వెడలెను. అయినఁ గర్నాటక మప్పుడు ఆంగ్లేయుల సంరక్షణ యందుండుట వలన వారితని నెదుర్ప సమ కట్టిరి. దాని నెఱింగి యితఁడు అప్పటికిఁ దనబలము చాలనం దున మరలి పోయి హైదరాబాదు చేరెను. రెండవమారు దండు వెడలుటకు నాఁటినుండి ఉపకరణములు సమకూర్ప మొదలిడెను. ఈసంగతివిని యాంగ్లేయు లప్పటికే యిక్కట్టు లో నుండిన వారుగాన బలవంతుఁడగు నైజాముతోఁ ద్వేషము గట్టుకో నొల్లక తమ ప్రతినిధి నొకని నైజామలీ వద్దకు సంధి చేసికొని రాఁ బనిచిరి.

1766 సంవత్సరపు సంధి.

1766 వ సంవత్సరము నవంబరు నెల 12 వ తేది నాఁడు స్నేహసంధి తీర్మానమాయెను. దీనివలన నాంగ్లేయ వర్తక సంఘమువారు వైజాము వద్దనుండి ఏలూరు, శ్రీకా కుళము, రాజమహేంద్రవరము, ముస్తఫానగరము, మూర్తి జూనగరము (గుంటూరు) అనుమండలములనుధృవ కౌ లుకుబుచ్చుకొని నై జూముకు వలయునప్పుడు దండును సిద్ధపఱచి యిచ్చుటకును అట్టి దండు అవసరముగాని సంవత్స రములలో గుత్త పైకముగ తొమ్మిదిలక్షల రూపాయీలు అత