పుట:Delhi-Darbaru.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సల బత్ జంగు.

115

-

ఆమె పుత్రుఁడు ముజఫర్ జంగు. ఇతఁడు దనతాత తనకు హైద రాబాదు సుబేదారీ నిచ్చిపోయెనని నుడివి తనహక్కు- స్థాపిం చుకొనఁ జూచెను. అప్పటికి దక్షిణ హిందూస్థానమున ఫ్రెంచి వారును నాంగ్లేయులును వ్యాపారవిషయములఁ బ్రతిస్పర్థులయి నెగడియుండిరి. ఇంతియెగాక' ఎవరికి వా రీదేశ మునఁ బలుకుబడి సంపాదించవలెననియు ప్రయత్నించు చుండిరి. కావున నాజర్ జంగు ముజఫర్ జంగులకు వరుసగ నా గ్లేయులును ఫ్రెంచి వారును దోడ్పడనియ్యకొనిరి. మొదట నాజరుజం గే విజయుఁ డయ్యెను గాని యతని ప్రజలే యతనిని జంపినందున ముజఫర్ జంగు 1750 లో సుబేదారుఁడయ్యెను. ఇతఁడును దమకు సరి " యయిన బహుమానము దొరక లేదని కోపము 'వహించిన పఠాను సైనికులచే నిహతుఁడయ్యెను (1751). ఇట్లు నాజర్ జంగు ముజఫన్ జంగు లిద్దఱును గతించిన తరువాత ప్రెంచివారు ఆసఫ్ జా మూఁడవపుత్రుఁడగు సలబత్ జంగును గద్దెపై నునిచిరి..

సలబత్ జంగు.

సలబత్ జంగు గద్దె నాక్రమించిన తరుణమున ఆసఫ్ జా మొదటి కుమారుఁడు గాజీ ఉద్దీన్ ఢిల్లీ నుండి వచ్చి తన హక్కును స్థాపించుకొనఁ జొచ్చెను.కానీ యద డక స్మాత్తుగ మృతి నందెను. సలబత్ జంగు' తల్లి విషము పెట్టి చంపి వేసెనని యొక చరిత్రకారుఁడు వ్రాయుచు న్నాఁడు. గాజి-ఉద్దీనుకు సాహాయ్యులుగ నే తెంచిన మహా