పుట:Delhi-Darbaru.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూ ర్వ చరిత్ర.

103


ఈరీతి నీ సంస్థానమున నుత్తమ సంపదకు వలయు విష యము లెల్ల యు గలవు. కావున నె నీసంస్థానముచే నాక్రమింపఁ బడియుండు - భూభాగము బహుకాలముగఁ జరిత్ర యందు ప్రఖ్యాతి గాంచుచు వచ్చుచున్నది. దీని తూర్పుదక్షిణ భాగ ములు నిశ్చయమగు చరిత్ర ప్రారంభ మగుటకు మున్ను ద్రావిడజాతులవారి స్వాధీనమున నుండెను. - ద్రావిడ భాషలు మాటలాడు జాతులలో నాంధ్రజాతి యిప్పటికిని తక్కినజాతుల కంటే నెక్కుడు జనసంఖ్య గలదయి యున్నది. ఈ సంస్థానము నందు మధ్య భాగమగు దక్షణా పథమును (దక్కను) రామాయణ మహాభారత కర్తలు పేర్కొని యున్నారు.. శ్రీరాముని కిష్కిం ధానగరము ఆనెగొంది. విజయనగరము లనుట ఇప్పుడందఱ కును దెలిసిన సంగతి యేగదా! ఆర్యులు దక్షిణాపథము నెప్పుడు లోఁ బఱచుకొని నదియు నిష్కర్షగఁ జెప్పుటకు వీలు లేదు గాని, క్రీ. పూ. 272_281 వఱకును నేలిన యశోకుని కాలమున నా తని రాజ్యము మాత్రము విహారమును, ఈ సంస్థానములోని పూర్వోత్తర భాగములను గూడ నావరించి యుండెను. ఔరంగా బాదు జిల్లాలో గోదావరీ తీరముననుండు పైఠణు సీమయందలి పి టెనికులు అశోకుని చే జయింపఁబడిన జాతులలో 'నెక్కరని యాతని శాసనముల వలనఁ గానవచ్చుచున్నది. [1]బౌద్ధరాజులకు దరువాత నీసంస్థాన భూభాగము పై నధికారము వహించిన వా

....................................................................................

1.

  1. అశోకుని శిలాశాసనము 5