పుట:Delhi-Darbaru.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

హైద రా బా దు సంస్థాన ము.


పురము, బీజపురము, ధార్వారు, జిల్లాలును తూర్పున కృష్ణా జిల్లా యును, వరదా గోదావరీ నదులును ఎల్లలు. దీని వై శాల్య ము 82, 698 చదరపు మైళ్లు. ఈ సంస్థానమును భూసారమున నేమి జన విశేషమున నేమి రెండు సమభాగములుగ భాగింప వచ్చును. " గోదావరీ, మంజీరా నదు లీ రెండు భాగములకును సరిహద్దులు. ఈ సరిహద్దుల కుత్తర భాగము నల్ల రేగడి భూమి' గోధుమలును ప్రత్తియు నట పండును. మహారాష్ట్రము కన్న డము భాషలు. ఈసరిహద్దులకు దక్షిణ భాగము తెలుఁగు దేశము. భూమి గులుక రాతితో మిశ్రమము. నేలలో నీళ్లు ఇంకుటకు వీలు లేదు. కావున నే యీ భాగమున చెరువులు మున్నగు జలాశయములు మెండు. వరిపంట సామాన్యము. బాలఘాటు కొండలు, సహ్యాద్రులు, జాల్నా గుట్టలు ఈ సంస్థానమున ముఖ్య పర్వత పంక్తులు.గోదావరి కృష్ణ, తుంగభద్ర, పూర్ణ, మంజీర, భీమ, వైన గంగ, మానేరు ముఖ్య నదులు. మూసి, వింది, ము నేరు మొదలగు కొన్ని ఉపనదులును గలవు. ఈసం స్థాన భూగర్భమున వజ్రములు, బంగారు, రాక్షసబొగ్గు బయలు వెడలి నవి. మించి ఇనుముకూడఁ గాన్పించు చున్నది. ఈసీమలో దట్ట మగు నడవులును న నేకములు గలవు. పులులు ఏనుఁగులు ము న్నగు మృగములును చిత్రవిచిత్ర వర్ణములతో మెప్పు పశు లును లెక్కకు మీరి యీయడవుల నల కరించు చుండును.