పుట:China japan.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

చీనా-జపాను

నుండి వాల్జిమోస్టాక్‌ అనుప్రదేశం పొడుగునను ట్రాన్సుసైబేరియను రైల్వే అను పేరిట రైలుమార్గము వేసుకొనిరి. దీనికే తూర్పుచైనా రైల్వే అని పేరుంది.రష్యాలో కలిగిన విప్లవంవల్ల సోవియట్టు రష్యాగా మారిన తర్వాత రష్యా వారికి మంచూరియాలోనున్న అధికారం అంతటిని వదలుకొనెను.ఈ సందర్భములో ఈరైల్వేలైను నంతటిని సోవియట్టు రష్యావారు మంచూకో ప్రభుత్వమునకు అమ్మివేసిరి. జపానువారు మంచుకో అంతటిలోను రైళ్ళను వేసి ఒకవైపు రష్యా సరిహద్దులను కాపాడుకొనుటకున్ను మరోవైపున జపానుతో సులువుగా రాకపోకల ఏర్పా ట్లకున్ను తగిన సౌకర్యాలను చేసుకొనిరి.

మంచూకోను చైనా ప్రభుత్వము నుండి విడదీయుటకు జపాను కృషి చేసింది.మంచూకో చైనానుండి విడిపో యింది. ఆ విడిపోయిన ప్రదేశానికి ప్రత్యేక ప్రభుత్వము ఏర్పడినది.ఆ ఏర్పడిన మంచూకో ప్రభుత్వము జపా ను అధికారం క్రిందనుంటూ ఆ మంచూకో ఆర్థిక సౌకర్యాలకు జపానే పెట్టుబడి పెట్టుతూ ఆవిధముగా చైనాలో ఈమంచూకో భాగాన్ని జపాను ఆక్రమించి ఒకవైపున సోవియట్టురష్యా నుండి జపాను సామ్రాజ్యతత్త్వానికి ముప్పురాకుండా జూచుకుంటోది. మరోప్రక్కను మంగోలియా రాష్ట్రాలలో జపాను తన సైన్యమునువుంచి క్రమేణా చైనాను కబళించాలనుకుంటోంది.