పుట:China japan.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జపాను

చీనా జనరలు హ్సూక్రిందను,మంగోలియా ప్రభువు అంగెర్నుస్టెర్ను క్రిందను పీడితులైన ప్రజలందరును మంగోలి యను ప్రజాపక్షమును స్థాపించిరి. ప్రభుత్వమును కూడానెలకొల్పిరి.పిచ్చిప్రభువును, చీనా జనరలును కూడా ఓడించిన వారు వీరే. వీరికి రష్యా సోవియటు ప్రభుత్వము సహాయమొనరించెను.చీనాప్రభుత్వము మంగోలియా ను తనక్రిందనుండి విడతీయరాదని సోవియటు ప్రభుత్వమునకు అర్జీ పెట్టుకొనెను. సరే చీనా క్రిందనే ఉండనీ అని రష్యాఊరకొనెను.అయినను మంగోలియా రిపబ్లికుపై చీనాకు నిజమైన యెట్టిఅధికారమును లేదు.ఈ దేశ ములో చాలామందిది బౌద్ధమతము.వారు సజీవబుద్ధుని(లివింగుబుద్ధ)పూజింతురు.కనుక బౌద్ధ లామాకు కొం త మతాధికారమున్నను,నిజమైన పరిపాలకులు మంగోలియను ప్రజాపక్షమువారే.1924 వరకుఒక బుద్ధుడు చస్తే మరియొక బుద్ధునెన్నుకొనుచుండిరి.కాని అప్పటినుండి ఆబుద్ధుని అనుచరులకు కాస్త ఆస్తిని విడచిపెట్టి తిరిగీ బుద్ధుని ఎన్నుకొనుటెమానిరి.

మంగోలియా రిపబ్లికు కాకముందు ఆదేశవర్తకమంతయు చీనావారి చేతులలో నుండెను.చీనావారు వారికి సరు కులరువిచ్చి అప్పులలో ముంచి పీడించుచుండిరి.రిపబ్లికు రాగానే ఆఅప్పులన్నీ రద్దుచేసినది. సహకార వ్యాపా రము వృద్ధియైనది. వెలుపలి మంగోలియాలో ఉన్నంత జాతీయత లోపలి మంగోలియాలో కాని మంచూకోలో కాని లేదు.ఇక్కడి పాఠశాల

29