పుట:China japan.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

చీనా-జపాను

మంగోలియాలో ఇంకను కొందరు మంగోలు నాయకులు జాతీయ భావపూరితులున్నారు.ఈజాతీయ భావము నూతగొని జపాను చీనారష్యాల కడ్డముగా వారిని నిలబెట్టవచ్చును.పశ్చిమ మంచూరియా,లోపలి మంగోలి యా, మంగోలియను రిపబ్లికు కలిస్తే మంగోలియా దేశమగును.జెహోలు, సౌంగాను అను రెండురాష్ట్రములు, మంగోలియాకు చెందినవి.అప్పుడే వానిని మంచూకో రాష్ట్రములోని అయిదు జిల్లాలలో ఒకభాగముక్రింద మార్చుకొనినది.చీనానుండి మంగోలియాకు యెవ్వరునూ పోకుండా రహదారీ ప్యాసుల సిష్టము జపాను పెట్టి నది.జపాను సేనలకు తెలియపరచకుండా ఆభాగములద్వారా రాకపోకలెవ్వరికిని సాధ్యముకాకున్నది.

హోపేయినుండిచీనా గవర్నరును తీసివేయవలెననిన్నీ,క్యూమింటాంగుతో దానికి సంబంధముండకూడదనిన్నీ, అక్కడ జపాను ప్రతికూల ప్రచారము చేయరాదనిన్నీ 1935 లో జపాను చీనాకు సందేశము పంపించినది. హోపేయితో సంబంధముంచుకొనని చీనాచేతులు కడుగుకొని జపాను విజయమును స్థిరపరచినది. చాహారు నుంచి కూడా చీనాగవర్నరును తరిమి జపాను తన గవర్నరును పెట్టినది.ఈ రెండు రాష్ట్రములతో తక్కిన మూడు రాష్ట్రములను చేరి వేరే స్వతంత్ర రాష్ట్రముగా కేటాయించవలెనని జపాను చీనాకు 1935 సెప్టెంబరులో ఒక సందేశము పంపినది.ఈరాష్ట్రమును"కమ్యూనిష్టు