యానులోపలి మంగోలియాలో తూర్పుభాగమును జపాను స్వాధీనములో ఉంచుకొనవచ్చును.మూడవభాగము ప్రకారము చీనాలో ఉన్నపెద్ద ఇనుపగనులన్నియు జపాను స్వాధీనమగును.నాలుగవ భాగము ప్రకారము చీనా యొక్క దీవినిగాని, సింధుశాఖనుగాని, రేవునుగాని హార్బరునుగాని ఒక్క జపానుకే కాక యితరజాతికిని బాడుగ వేయరాదు.అయిదవ భాగము ప్రకారము చీనా యెల్లయు జపానుకు ఆర్థిక రాజకీయదాస్యము చేయు నట్లు బిగించును.
యుఆన్షి-కాయ్, ఈడిమాండులకు లొంగుదామా మానుదామా అని చాలాకాలము తటపటాయించెను.కాని ఈషరతులకు ఒప్పుకుంటావా లేక యుద్ధముచేస్తావా అని జపాను అంత్య సందేశమును పంపినప్పుడు అయిద వ భాగము డిమాండులకు తప్ప తక్కినభాగముల కన్నిటికిని యుఆన్షి-కాయ్ తలయొగ్గెను.ఈ అయిదవ భాగమునకైనను యుఆన్షి-కాయ్ మొగముచూచి జపానులొంగలేదు.బ్రిటను మొదలగు విదేశీప్రభుత్వముల నిర్బంధమొకటియుండుటచే ఇప్పటిమట్తుకు జపాను ఆషరతులను ఉపసంహరించుకొనెను.
1916 లో జపాను చీనాలో ఒక ఒడంబడిక చేసుకొనెను.దాని ప్రకారము విరోధులనెదిరించుట యందును, ఉభయుల సంరక్షణమునందును ఒకరికొకరు సహాయము చేసుకొనుటకును యుద్ధసామగ్రిని చేకూర్చుటకును ఒప్పుకొనిరి.ఈ
4