పుట:China japan.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

చీనా-జపాను

సేనలలోతిరిగి వారికి దేశాభిమానము నూరిపోయుచున్నది.1931 నాటికి వీరిసంఖ్య 27,60,000 వీరుకాక జపాను రిజర్విష్టు సంగమని యింకటున్నది. వీరు జపానులోని బౌద్ధమతావేశపరుల సహాయముతో జపాను సామ్రాజ్యతత్వము పైని చక్రవర్తి పైని వీరత్వముతోకూడిన పూజ్యభావమును కుదుర్చుచున్నారు.ఓదోగికాయ్‌, డెయినిప్పను, కొకుసుకేయి మొదలగు సంఘములు జపానులో కార్మిక విప్లవ భావములు కలుగకుండా ప్రచారమును ప్రారంభించుచున్నవి.కొందరు పార్లమెంటు సభ్యులు వీనిలి సంస్థాపకులు.డేనినిప్పను సంఘము కార్మికులను పూంజీదారులకును స్నేహము గూర్చుటకై సియూకాయి పార్టీవల్ల స్థాపించబడినది.వేరెట్టి హత్యలు దోపిడులు క్రౌర్యములు చేసినను వీరికి శిక్షలుండవు.ఇవన్నీ జపాను ప్రభుత్వ సంరక్షణమునకై ఒనరించ బడి నవి.తోచినంత మాత్రమున చాలును.విశ్వవిద్యాలయములు వామపక్షములు చెలరేగకుండుటకై దోహదము చేయుచున్నవి.ఇటువంటి సంఘములు నేడు 600 ఉన్నవి.శ్రీమంతులు, భూస్వాములు, సేనానాయకులు అందరును వీరికి సహాయము చేయుచుందురు.ఈవిధమైన భయంకర సంఘముల కన్నింటికిని యేదోయొక రీతిని విప్లవ ప్రతికూల ధన్యాధ్యమిత వాదజాతీయ సంస్థలతోను మనుష్యులతోను సంబంధముండనేయున్నది.