పుట:China japan.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జపాను

హింసించుచుండుట వల్లనే సాధ్యమయ్యెనని పెక్కురితలంపు.పారిశ్రామికముగ మాత్రమే జపాను అభివృద్ధి పొందెను కాని వ్యావసాయకముగ మునుపటిస్థితిలోనే ఉండెను.వ్యవసాయకుల కష్టములు తగ్గలేదు, రాబడి హెచ్చలేదు.జపానులో తయారైన వస్తువులను కొనుక్కొని అనుభవించుటకు జపాను కార్మికకర్షకులకు సాధ్య ము కాదాయెను.ఈసరుకంతయు విదేశముల కెగుమతి కావలసినదే.విదేశపు మార్కెట్టులన్నియు పాశ్వాత్య ప్రభుత్వముల వశమునందుండెను.ఐరోపాయుద్ధము ధర్మమా అంటూ వాటి విజృంభణము పూర్తిగా చల్లరినప్పటి నుండియు జపానుసరుకు పరదేశములకు యెక్కువగా యెగుమతి కాజొచ్చెను.కాని లాభములు భాగ్యములు అన్నియును వర్తక జాతులకే తప్ప కర్షక కార్మికులకు యెక్కువగా లేకుండెను.కూలులు యెక్కువచేసీ చేయ డములో వారి లాభములు కూలి వారిపరిశ్రమలు మూలపడక మానవు,జపాను బాగుపడుటకెల్లయు కారణము తక్కువ కూలులిచ్చి యెక్కువ వస్తువు తయారుచేసి ఇతర దేశములకంటె సరుకును విదేశపుటంగళ్ళలో చౌకగా అమ్మి వాటిని గుత్తగొనుటయే కనుక జపాను కర్షకకార్మికులకు బాగుపడేయోగము లేదన వచ్చును.జపాను కీర్తిలో తాముకూడాభాగస్వాములమే యను గర్వము ఉంటున్నన్నాళ్ళు వారు దారిధ్యముతో నీల్గగలుగుదురు. కాని వర్గచైతన్యముదయించిన తరువాత ఇదిసాధ్యముకాదు.జపానులో వర్గ చైతన్యము కూడ ఉదయించినది.

37