రాష్ట్రములో ప్రవేశించి అచ్చటనున్న సోవియట్టు సేనాని హ్సూహ్సిసియాంగుషేను సేనలను కలుసు కొనెను. క్వెయిచొ, షెచ్వాను, సికాంగు, యున్నాను, కాన్సూ,షాన్సీ జిల్లాలను చేర్చి ఒక పెద్ద సోవియటు రాష్ట్రము ను నిర్మించెను.ఈవిధముగా ఇప్పటికి 398 జిల్లాలలో సోవియటు ప్రభుత్వము నెలకొల్పబడినది.ఇప్పటికి యెఱ్ఱ సైనికుల సంఖ్య 5లక్షలు.వీరిక్రింద 19 రాష్ట్రములున్నవి.వీటి పేరులు కియాంగ్సీ, క్వాంటంగు, ఫ్యూకీన్, షెకియాంగు, అన్వుహెయి, హోనాను, హ్యూపె, హ్యూనాన్, షెచ్వాను, క్వెయిచొ, యున్నాను, సికాంగు, షెన్సీ, కాన్సూ, హ్యోపేయి, ఫెంగ్టీను, కిరీను, హైలంగుకియాంగు.
జపాను ప్రతికూల పక్షములు
18-9-1931 తేదిన్ చీనాలోఒకపెద్ద ఖండమును జపాను ఆక్రమించుకొని మంచూకో సామ్రాజ్యమును స్థాపించినది.మరి నాలుగేళ్ళవరకు ఈవిజృంభణము ఇట్లే సాగినది.చీనాలో సుమారు సగము భాగము జపాను సామ్రాజ్యము క్రిందనో సైనికదళములక్రిందనో నలిగి వారికి లొంగిపోయినది.మంచుకో తరువాత జహోలు స్వాధీనమైనది.పిమ్మట చీనా“పెద్దగోడ”(గ్రేట్వాల్)చుట్టునున్న ప్రాంతమగు షాంఘయిక్వాను స్వాధీనమైనది. తరువాత లియాంగుటంగు జిల్లాలుని సైన్యములు నిరాయుధములు చేయబడినవి. పిమ్మట సూయనును, చాహార్, హోపేయి రాష్ట్రములను జపాను