పుట:China japan.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
VII

పోదు,ఈదాస్యము నశించదు,ఐకమత్యము కుదరదు, ఐశ్వర్యము లభించదు అని నిశ్చయము చేసుకున్నవి. రెండింటియందును పట్టణములు యంత్రపరిశ్రమలును తలయెత్తినవి.కొన్ని స్వదేశీ పెట్టుబడుదారులవి,మరికొన్ని విదేశి కంపెనీల వారివి.

ఫ్యాక్టరీలు యెవ్వరివైనను, కార్మికుల నోళ్ళలో కరక్కాయే,వినియోజకుల నెత్తికి దెబ్బలే,ఒక్క పూంజీదారుల యెుడులలో మాత్రము అనంతమైన లాభములు.ఆధునిక నగరములు,యంత్రములు,ఉత్పత్తి, లాభములు అవతల ప్రారంభించగానే,ఇవతల కార్మిక సంఘములు యెక్కువకూలి తక్కువ గంటలకై డిమాండులు, సమ్మెలు, కార్మికరాజ్య స్థాపనకై ప్రయత్నములు, సాంఘిక తత్వబోధనలు వెనువెంటనే రాకమానవు.కార్మిక ప్రబోధముతో కర్షక ప్రబోధము కూడ వెంటనే కలుగును.బీడు భూములన్నీ సాగుకావలెననీ, మంచి యెరువులు వేయవలెననీ, భారీమిాద యంత్రపద్ధతులతో వ్యవసాయము చేయవలెననీ, కష్టపడిన వారికే ఫలమంతా దక్కవలెననీ, సోమరిపోతు భూస్వాములను అణిచి వేయవలెననీ రైతు రాజ్యం స్థాపించవలెననీ ఆందోళన బయలుదేరుతుంది. కర్షక కార్మికు లేకముకాకుంటే వారికష్టములు తీరవని వారికి నిశ్చయం కలుగుతుంది. రాజకీయంగా ఆర్ధికంగా, సాంఘింగా, ఆవసరమైతే సైనికంగా ఇరువున్నూ ఒక్కటే