పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాడినపాటే

505


శ్లో. స్వాధీనో రసనాంచలః పరిచితాశ్శబ్దాః కియం తఃక్వచి
    త్క్షోణీంద్రోననియామకః పరిషద శ్శాంతా స్స్వతంత్రం జగత్.

ఇఁక నిప్పటికి విరమించుచున్నాఁడను. ఎంత యొప్పైనదానినేని తప్పుచేసెదనని నాయంతట నేనై కాకున్నను శ్రీశాస్త్రులవారి నిర్బంధము వలన ననఁగా వారి విమర్శనవిధాన మిట్టిదియని చదువరులకుఁ దెల్పుటకైనను బ్రతిజ్ఞపట్టుట కొంత దొసఁగు కాకపోదు. ఇందులకు నేనెంత చదువరులను "మన్నింపుఁడని” ప్రార్ధించినను నాపై వారు కొండొక కనులెఱ్ఱఁజేయక మానరని కొంకుచున్నాఁడను. ఈ ప్రతిజ్ఞ

శ్లో. విదుషాం నివహై రిహైకమత్సా ! ద్యదదుష్టం నిరటం కియచ్చ దుష్టం
    మయి జల్పతి కల్పనాధి నాథే ! రఘునాథే మనుతాం తదన్యదైవ.

అనినుడివిన రఘనాథభట్టాచార్యునికిఁ గాని “శ్లో ఆమూలాగ్రతస్నానోః ... ... వాచా మాచార్యతాయాః పదమనుభవితుంకో౽స్తి ధన్యోమదన్యః." అని నుడివిన జగన్నాథ పండితరాయలకుఁగాని నావంటి సామాన్యునకుఁదగదు. పైనుదహరించిన శ్లోకద్వయము వలన శాస్త్రులవారి వ్రాఁతలోని "వేంకటశాస్త్రిగారు ప్రకటించిరి. నందిని పందినిచేసేది. పందిని నందినిచేసేది యిదేకాఁబోలును... ..ఏవిమర్శకుఁడును చారిత్రాత్మకముగ (పుక్కిటికథలుగాక) నిట్లు ప్రతిజ్ఞపట్టినట్లెఱుఁగను.” అను నక్షరములు పరాస్తములు. ఇపుడేని యెఱుఁగఁదగు. ఇది యిటులుండ, తగకున్నను, నియ్యది యనుకృతికై కైకొన్న భూమికనుగా భావించి పాఠకలోకము నన్ను క్షమించుఁగాక యని వేఁడుకొనుచున్నాఁడను.


★ ★ ★