పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవులు భిక్షాటకులేనా?

257


అని పూర్తిచేశారఁట! అసలు నల్లటికుక్కనుజూచి యీసమస్యను యిచ్చాఁడఁట! తరువాత ఈశునకము (బాణము) కృష్ణమూర్తి శ్రీ మహా విష్ణువు (త్రిపుర విజయంలో నన్నమాట.) ఆయన జీవితమంతా యీలాటి ప్రసంగాలతోటే వుంటుంది. రామలింగం తరువాత యీయన రెండో రామలింగమని యీ చరిత్రను బట్టి చెప్పకుంటారు.

విస్సన్నచెప్పింది వేదం అనే లోకోక్తి యేమహావిద్వాంసుణ్ణి పురస్కరించుకొని పుట్టిందో అట్టి యింద్రగంటి విశ్వపతి శాస్త్రుల్లుగారిని కూడా లక్ష్యపెట్టని యుక్తిశాలి యీ లక్ష్మణకవి.

మామా! వీదీస్తే శ్వపతివి (కుక్కవు) శ్వాదీస్తే విపతివి (వీనాం పక్షిణాం పతిః) అన్నాడట యేదో సందర్భంలో;

యీలా వ్రాస్తూవుంటే పెరుఁగుతూనే వుంటుంది. ప్రధానాంశం లక్షణకవిగారు నాగవల్లి పళ్యాలకు వెళ్లేవాఁడవడంచేత భిక్షాటకులలోకి వస్తాఁడనే వారిమాట పాటించతగ్గది కాదనియ్యేవే. ఆ పళ్యాలు కూడా క్విటురెంటు భూములవంటివిగాని యాయవారంబాపతు కావు. కాని అవి పోనుపోను నీచస్థితిలోకి వచ్చాయి.

క. "నాఁకబలి పళ్లేరమ్ముల
     నాఁకట జీవించు కుకవు లరుగుదురె"

అని మే మనడానికి క్కారణం మా రోజులనాఁటికి వాట్ల గౌరవం తగ్గిపోవడమే. కృష్ణమూర్తిగారి జీవిత కాలంలో ఆయనకున్నంత గౌరవం యేకవికీ లేకపోవడంచేత ఆయన పెద్దగా భూవసతి సంపాదించి పిల్ల జమీందారుగా ప్రకాశించారు. జీవిత కాలంలో ఆయన గొప్పవాఁడు. జీవితాంతం ఈయన (లక్ష్మణ కవి) గొప్పవారు. క్రియలో మాట - యీ వుభయులలోనూ యెవరిప్రసక్తి వచ్చినా రెండోవారి ప్రసక్తిరావడం తప్పదు. ఆయన మహా విద్వత్కవి అయినా ఆమాటను నిల్పేకవిత్వం యేదీ కనపడకపోవడంచేత “పిళ్లఃకవిరహం విద్వాన్" అన్నట్టు వ్యవహరించవలసి వుంటుంది. లక్ష్మణకవి విద్వత్కవి కాకపోయినా రచన విద్వత్కవి సమ్మతమే. కనక నేఁటి కేవల కవుల పంక్తిలో చేర్చకూడదు. యితని భిక్షాటనం “పట్టుకోకెట్టమని పెళ్లికూతురివారంటారు, పట్టుకో కెట్టమని మే మంటాం, యీ తగాయిదా తీరితేగాని పెళ్లి స్థిరపడేటట్టు లేదు." అనే వైఖరిలో వుంటుంది. యీ మాట వినీ వినడంతోడనే పట్టుచీర కూడా తెప్పించి యిచ్చి పెండ్లికి పంపించారఁట. అప్పటి పిఠాపురం జమీందారు నీలాద్రి రాయణింగారు మా ముత్తాత “రావు వేంకట నీలాద్రి రాయనృపతి, చేత సత్కృతి చెందు విఖ్యాతయశుఁడ" అని, వ్రాశాఁడు. మా ముత్తాతగారికన్న కొంచెం లక్ష్మణకవిగారు చిన్నలయితే కావచ్చును. వీరిద్దరూ కలుసు కొన్నట్లు కొందరు చెప్పగా విన్నాను. అంతేకాదు.