పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వ్యాకరణ విషయంలో కొంతకున్నూ సున్నచుట్టే కుతూహలం కలవాణ్ణే. చూడండీ యీ పద్యంలో యతి మ్రొక్కుబడి చెల్లించుకున్నట్టే వుందో మఱి యేలా వుందోను.

శా. "కేదారేశు భజించితిన్. పద్మాక్షు సేవించితిన్-యాదో నాథ సుతాకళత్రు బదరీనారాయణున్." యతి సజాతీయ వర్ణశ్రవణం యేదో విధంగా కావడమేకాదు. భవతు. దీన్ని గుఱించి మఱొకప్పుడు మాట్లాడుకుందాం.

ద్రుతప్రకృతి సంధికి యెన్ని చోట్లనో ఆసీమాంతం చెపితే యెంతో అనుకూలంగా వుంటుందనుకుంటాను. అపార్థాలు అళ్లీలాలు రావడానికి ఆయీ సంధి కారణం. విద్వాంసులు చదువుకునేకబ్బాలలోవుంటే వుంటుంది గాక, స్కూలు విద్యార్థులు ఫైనలు లోపున చదువుకునే పుస్తకాలలోనైనా తగ్గించి ముద్రిస్తే చాలా బాగు. ముద్రణంలో తగ్గించినా టీచర్లు ఆయీ చోట్ల ఫలానా సూత్రంవల్ల ఫలానా విధంగా మారవలసివస్తుంది. ఆ మార్పు శ్రవణసుఖంగా వుండదని చేయలేదని బోధించడం వల్ల కొంత వ్యాకరణ జ్ఞానం కూడా అలవడుతుంది,

“తొలఁగిచనియె నేమి చెప్పదున్ గురునాథా!” అన్నచోట వింటూ వున్నవాడు కురునాథుడే కనక సరళంగా కాక పరుషం (కురు)గా విఱుచుకోవడం సుగమమే అయినా కుమ్మరి గురునాథుణ్ణి స్ఫురింప జేసికొని కవి బ్రహ్మగారికి ఆయీచోట రచన సాగలేక పోవడం వగైరా వొక చిన్న యితిహాసం కల్పించి గురునాథునికి విద్వత్పరంపర యిచ్చే పాండిత్య గౌరవం నాకూ యిష్టమే కాని అంతటి మహాకవికి యీ స్వల్ప సందర్భం దగ్గిర ధార ఆగడమంటే యేదో మాదిరిగా వుంటుంది. ఈలాటి తపనాలు లేకుండా కురునాథా! అనే వ్రాస్తే, 'నచ శంకా నచోత్తరమ్‌' ... ... గదా! భవతు. యీలా వ్రాస్తూవుంటే పెరుగుతూనే వుంటుంది. గ్రంథం.

కవులు చాలావరకు స్కూలుబాలుర పాఠ్య పుస్తకాలలో స్పష్టప్రత్తిపత్తికొరకు కొన్ని సంధులు విడుచుట చూస్తున్నాము. అది చాలా అభినందనీయంగా వుంది. అంతమాత్రంచేత గ్రంథకర్తకు ద్రుతప్రకృతిక సంధి కూడా తెలియదని అనుకునే ప్రాజ్ఞులు వుండరు. విద్యార్థులకు దానివల్ల కలిగే వుపయోగాన్ని వ్రాసేవున్నాను. శ్రీ శంభుప్రసాదుగారు నన్ను నేటి రచయితల గూర్చి సందేశాన్ని యివ్వవలసిందని చాలాసార్లు కోరివున్నారు. నా సందేశం "ముది మది తప్పితే మూడు గుణాలు" అనే లోకోక్తికి స్ఫోరకంగా వుంటుంది. దీన్ని లోకం యెంతవరకు విశ్వసిస్తుందో నాకు తెలియదు. ఆయన మాట తీసివేయలేక యీ కాస్తావ్రాసాను. లోకం దీన్ని ఆదరిస్తే పిమ్మట యింకా వ్యాసాలు యీలాగే వ్రాస్తూవుంటే చూచుకుందాం.


★ ★ ★