పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఉ. నాకొమరుండ వంచు నెటునమ్మదు? నశ్వముc గట్టిపెట్టితో
వీంక నెదిర్చితో? యిదియు విందగునే నరపాలసూతికీ
రాక గనుంగొనంగ నిను రాకొమరుండ వటన్నమాటకే
లోకము విశ్వసింపదెటులో? యింకనాకొమరుండ వన్నచో.

శూరునకు శూరుండుకాని కొడుకునం దెలా గౌరవం వుండదో వీరునకు వీరుండుకాని శిష్యునియందున్నూ ఆలాగే గౌరవం వుండదని చెప్పనక్కరలేదు. వేయిమంది అగస్త్యభ్రాతలకు గురు వనిపించుకోవడంకన్న భీష్మునివంటి వొక్కనికి గురువనిపించు కోవడమే గురువుకు సంతోషదాయకము. అట్టి గురుత్వానికే అందఱూ ఆశించతగ్గది. మురారి మహాకవి యేమన్నాడు?

"స్థానే స్వశిష్యనివ హై ర్వినియుజ్యమానా విద్యాగురుం హి గుణవత్తర మాతనోతి"

అన్నాడు. యొక్కువ అదృష్టవంతులైన గురువులకుఁగాని వారిని మించిన శిష్యులున్నూ, కొడుకులున్నూ వుండితీరవలసిందిగా కవులనాదిగా అభిప్రాయపడుతూన్నట్లు యెన్నో చరిత్రలు సాక్ష్యమిస్తాయి. నిజంగా అట్టి శిష్యులూ, కొడుకులూ వున్నారో లేదోగాని వున్నట్లు కవులు వ్రాస్తూ వున్నారు. ఆలా వ్రాస్తేనేకాని కవులకు సంతుష్టి వున్నట్లు తోcచదు. "పార్థ ఏవ ధనుర్ధరః" అనిపించుకొన్న అర్జునుణ్ణి కొడుకు బభ్రువాహనుండు వోడించిన సందర్భానికి గంగా శాపం కారణంగా వుంది. కనక అంతగణనీయం కాకపోయినా శ్రీరాముణ్ణి పసికుల్దలు కుశలవులు వోడించినట్టు కవులు చిత్రించారే! యిది విశ్వసనీయమేనా? అట్టి కవులమీంద శ్రీరామునికి కోపం రావడానికి మాఱు అనుగ్రహమే వున్నట్లు తోస్తుంది. ఎందుచేత? ఇట్టి కల్పనాచమత్కృతిగల కవులే లేకపోతే శ్రీరాముండు అదృష్టవంతులలో అగ్రేసరుండు కాకపోవలసివస్తుంది. తన కొడుకులు తన పేరు ప్రతిష్టలమీందనే ఆధారపడడానికి కవుల కెవ్వరికీ యిష్టం లేనట్టు కనపడుతుంది. అందులో పిల్లల మట్టికవి యీ విషయంలో వ్రాసినపద్యం మతీ అద్భుతంగా వుంటుంది. యిదివఱలో వకటి రెండుసార్లు వుదాహరించినదే అయినా ఆ పద్యాన్ని మళ్లా వుదాహరిస్తాను.

క. అనిచదివి లవుండు రాఘవ
మనుజేంద్రుని తల్లి వీరమాతంట సీతా
జనని కుశలవుల నిరువురC
గనియు నకట! గొడ్డువోయెం గడపట ననుచున్.

ఇక్కడ సర్వాత్మనా. గ్రంథకర్తతాత్పర్యం రాముణ్ణి అధఃకరించడం కాదు. రాముణ్ణి సర్వోత్కృష్ణుణ్ణి చేయడమే “పుత్రాదిచ్ఛేత్పరాజయం" అన్నసూక్తికి వుదాహరణం కాని