పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సి. పి. బ్రౌన్ దొరగారు

క్రై 1770 తర్వాత 1820 వఱకు నీమహాశయుఁ డాంధ్రభాషకై యతిప్రయాసపడి మహోపకృతి సల్పినవాఁడు. అనేక సంస్కృతాంధ్రగ్రంథములను సేకరించెను. తెల్గునకు నిఘంటువులు నిర్మించెను. జూలూరి అప్పయ్య, గురుమూర్తి శాస్త్రి మొదలగు ననేక పండితుల నాదరించెను. ఇప్పుడు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమున నున్న సంస్కృతాంధ్రగ్రంథములం దనేకము లిమ్మహనీయుఁ డార్జించినవే.

క. నూరార్లు లెక్క సేయక
    పేర్లందిన విబుధవరులఁ బిలిపించుచు నే
    మా ర్లర్థ మిచ్చు వితరణి
    చార్లెసు ఫీలిప్సు బ్రౌను సాహెబు కరుణన్.

బీదఱికమును గుడుచుచున్న యొక యాంధ్రపండితుఁడు సి. పి. బ్రౌన్ దొరగారికి భాగవతమందలి యీ క్రిందిపద్యమును వ్రాసి తనకు ద్రవ్యసాహాయ్యము వేఁడుకొనుచు నొకయర్జీ పంపికొనెనఁట! ఆపద్యము.