42
చాటుపద్యమణిమంజరి
ఉ. ధాటిగ నేఁగి యుద్దగిరిఁ దార్కొని వేంకటరాజుఁ దోలి ముం
గోట లగ్గపట్టి వినుకొండయు బెల్లముకొండ తంగెడల్
పాటిమెయిన్ హరించి మఱి బల్మిని గైకొనెఁ గొండవీడుఁ గ
ర్ణాటకరాజధాని యిభరాముఁడు బాహుబలంబు మీఱఁగన్.
ఈతనిపేర “ఇభరాం పట్టణ”మని నేఁటికిని బుర మొకటి కలదు. తురుష్కుఁ డైనను నీతఁ డాంధ్రభాషయం దత్యంతాదరము కలవాఁడై యనేకాంధ్రకవుల నాదరించి ధన మొసఁగి మిక్కిలి విఖ్యాతి సెందెను. పొన్నిగంటి తెలగనార్యుఁ డనుకవి యయాతిచరిత్ర మను నచ్చతెల్గుప్రబంధమును, అద్దంకి గంగాధరకవి తపతీసంవరణోపాఖ్యానమును, నీతని ప్రాపున రచించిరి. కవీశ్వరులగోష్ఠియం దీతనికిఁ గుతూహలము మెండు. ఒకప్పుడు మల్కిభరామ్ ప్రభువు తనయాస్థానమునకుఁ బెమ్మసాని తిమ్మానాయని, అనంతపురపు హండెయప్పను, మట్ల అనంతరాజును, బంగారేచమనాయని, పేర మల్లారెడ్డిని, వారి వారి కవీశ్వరులతోఁ బిలిపించి, వారినిఁ బొగడిన పొగడ్తలు వినిపింప నాయాకవీశ్వరులఁ గోరెనఁట! ఆకవీశ్వరులు చదివిన పొగడ్తపద్యము లివి—
ఉ. చాలు గుఱాలు మాగడినిసంగడిరాజులు గొల్వరం డహో
హాలహలోగ్రఫాలదహనాక్షునియంతటిధాటివాఁడు నా
యేలిక వేంకటాద్రిధరణీశుని తిమ్మఁడు పెమ్మసాని భూ
పాలుఁడు హెచ్చుధాత్రిఁగల పార్థివు లెల్లరు లొచ్చు వానికిన్.
ఉ. మట్టకరాఁడు బెట్టుఱికి మన్నెకుమారులసీమ ధూళిగాఁ
గొట్టక మానఁడేకద యకుంఠితసింహడలాటరాయఁ డీ
పెట్టినదండుఁదీఁడు రణభీష్ముఁడు హండియయప్పశౌరికిన్
బెట్టుఁడు వేగ దండములు బింకము లేటికి శత్రుభూపతుల్!