పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మల్కిభరామ్

41

    ధాన్యంబు లాదిగాఁ దగుసవరణ లెల్ల
                    నొకటియుఁ గొదవ లేకుండ నునిచి
    నీతిమార్గంబున నెనరైన దొరలను
                    బలసి పాళెములందుఁ గొలువు నిలిపి
గీ. నగరికావలి సావధనముగ నునిచి
    చోద్య మిది యెట్టివారి కభేద్య మనెడు
    నట్టు దుర్గంబులం దుండునతఁడు రాజు
    గుండభూపాలునరసింహమండలేంద్ర!

బలపద్ధతి


సీ. బేడు పైతరువులు పెట్టక చేజేత
                    ఠవణదప్పకయ జీతంబు లిచ్చి
    చేరువదొర లిచ్చుజీతంబు వచ్చుట
                    రాకయుండుట విచారంబు చేసి
    యగువలై తల..............తగ్గినైనను
                    గట్టకుండిన వారకముగ నిచ్చి
    రణరంగమునఁ గానరా మెలంగినచోట
                    నుచితంబు లొసఁగుచు నుపచరించి
గీ. ప్రాఁతవారిని గొల్వాసపడనివారి
    మూలబలముల మన్నీల మొనలకంటె
    నంగళంబుగ నేలినయతఁడు రాజు
    గుండభూపాలునరసింహమండలేంద్ర!

మల్కిభరామ్

ఈతురుష్కప్రభువు క్రీ.శ.1550 తరువాత నాంధ్రదేశము నాక్రమించుకొని పరిపాలన మొనర్చినవాఁడు. ఈతనివిజయముల నీచాటువు చాటుచున్నది.