పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భృంగపంచకము. శ్రీనాథకృతి యందురు.

సౌందర్యశాలినియగు నొకనరపాలునిదేవేరి యమాత్యునకుఁ జనవుపడియుండెను. ఒకప్పు డాభూపతి కార్యవశమున స్థలాంతరమున కరుగుడు నామంత్రి యంతిపురమునఁ జేరుకొని రాజమహిషితోఁ గేరింతలాడుచుండెను. పుడమిఱేఁడును నాఁటిరేయికే మరలఁ దిరిగివచ్చుటయుఁ గోటలోనికి వచ్చినతోడన కవాటములెల్ల బంధింపఁబడుటయు నెఱిఁగి దూతికయొక ర్తీవృత్తాంత మమాత్యునకుఁ దెలిపి దాఁకొనుటకు భృంగాపదేశమునఁ జెప్పినది—

ఉ. మాయురె భృంగమా! వికచమల్లికలన్ విడనాడి తమ్మిలో
    నీయెడఁ బూవుఁదేనియల నింపు జనింపఁగఁ గ్రోలి సొక్కియున్
    బోయెద నన్నభ్రాంతి నినుఁ బొందదు రా జుదయించె నిప్పు డీ
    తోయజపత్రముల్ వరుసతే ముకుళించెఁ జలింపకుండుమా!

పుడమిఱేఁడు శయనాగారమున కరిగినపిదపఁ గొంతదడవునకు మంత్రి యిఱుకటమున దాఁగియుండఁజాలక యిటునటుఁ గదలఁగాఁ జప్పుడగుట విని మఱల నాదూతి చెప్పునది—

చ. అళికులవర్య! పద్మముకుళాంతరమందు వసింపనేరమిన్
    జలనము సెందెదేమి నవసారసమిత్రుఁడు రాకయుండునా?
    తొలఁగక యందె యుండు మిఁకఁ దోయజవైరి తిరంబె రాత్రి యీ
    కలవర మేల? తమ్మి తుద గానక తూఱక యూరకుండుమా!

సాధ్వీమణి యగు నామంత్రిభార్య ఱేఁ డంతిపురమునఁ జేరుటవిని రేయి రెండుజాములు కటచనినను దనభర్త యిలు