అడిదము సూరకవి
బొమ్మరిం డ్లాయెనా భూరిభేకాండజా
ధారమై తనరు కేదారచయము
గీ. నీకు విహరింప వసతులై నివ్వటిలెనె
చిన్నపొలములు; బ్రాహ్మణక్షేత్రమునకు
ఘాతుకత్వంబు సేయుముష్కరులు గలరె?
కదలు మిటమాని దివిజగంగాభవాని!
అడిదము రామకవి పైవిషయమునుగూర్చి పూసపాటి విజయరామరాజుగారి కిచ్చుకొన్న యర్జీపద్యములు—
సీ. అవధారు! దేవ! మహాప్రభూ! విన్నపం
బాశ్రితోత్తముఁడ శుద్ధాంధ్రకవిని
పేరు రామన యింటిపే రడిదమువారు
మాజాగ భూపాలరాజురేగ
వల్లకృష్ణక్షమానాయకాగ్రేసరుఁ
డెఱ్ఱకృష్ణక్ష్మాతలేంద్రు లచటఁ
గరణికధర్మంబు గల్పించి మాన్యంబు
దయచేసి రది యాస్పదంబు మాకు
గీ. నదియు నీయేఁడు దంతులూరన్ననృపతి
సత్తముఁడు గ్రామమెల్లను గుత్తచేసి
చెఱువు బిగఁగట్టి ప్రజలు జేజేపడంగ
ముంపుగట్టించె వరిపొట్ట ముంపఁదలఁచి.
సీ. విన్నవించెద నాదువృత్తాంత మది కొంత
చిత్తగింపు పరాకు సేయకుండఁ
బొలములో నొకఁ డేరు పూన్పంగఁ జాలఁడు
గంగాభవానిఢాకకును జడిసి
దుక్కిటెడ్లను గొని దున్నుకుంద మటన్న
బదులియ్యఁ డెవ్వఁడు పాఁతనేబు