పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణదేవరాయలు

155

    మానవతీశిరోమణులమాలికలందును గూర్ప వత్తువో
    కానుక లియ్య వత్తువొ వికాసము నిత్తువొ విల్వదెత్తువో.
ఉ. తక్కక నేలముట్టెగొని త్రవ్వఁగనేర్తు నటుంచుఁ దాకుతా
    వొక్కటె జాతి యంచు ముద మొందకు బుద్ధిని వెఱ్ఱిపంది! నీ
    వెక్కడ! యాదిఘోణి యన నెక్కడ! యద్రిసముద్రదుర్గభూ
    ర్భాక్కుతలంబు నొక్కయరపంటనె మింటికి నెత్త నేర్తువే.

రాయలయాస్తానమున కొక సంస్కృతకవి యరుదెంచి పెద్దనాద్యాంధ్రకవీశ్వరుల యెడ నీసడింపుతో నిట్లు పల్కెనఁట—

శ్లో. ఆంధ్రభాషామయం కావ్య మయోమయవిభూషణమ్

వెన్వెంటనే పెద్దనామాత్యుఁడు చెంపపెట్టు పెట్టినట్లు పూరించె!

    సంస్కృతారణ్యసంచారి విద్వన్మత్తేభశృంఖలమ్.

రాయలకుఁ జదరంగపుటెత్తులు వేయుటయం దత్యంతాసక్తి యుండెడిదఁట! బొడ్డుచర్ల చినతిమ్మన యను కొప్పోలు కరణము కవీశ్వరదిగ్దంతియను ప్రతిష్ఠగలవాఁడై శ్రీకృష్ణరాయలతోఁ జదరంగమాడుచుండెడువాఁడు శ్రీకృష్ణరాయలపక్షమున నెంద ఱాలోచించి యెత్తు వేయుచున్నను నీతఁ డొక్కడే యెదురెత్తు వేసి యాట గెల్చుచు వేయార్లు పందెము గొనుచుండెడివాఁడట! ఆతనిశక్తికి సంతోషించి కొప్పోలు గ్రామమునకు గృష్ణరాయపురమనునామ మేర్పఱిచి రాయలు సర్వాగ్రహారముగా నాతనికి ధారవోసెను.

క. శతసంఖ్యు లొక్కటైనను
    సతతము శ్రీకృష్ణరాయజగతీపతితోఁ