పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

చాటుపద్యమణిమంజరి

    మొక మటుక్రిందుగాఁ దివిచి ముక్కలువోవ నినుంపకత్తితో
    సిక మొదలంటఁ గోయుదును జెప్పునఁ గొట్టుదు మోము దన్నుదున్.
చ. తెలియనివన్ని తప్పు లని దిట్టతనాన సభాంతరంబున్
    బలుకఁగ రాకురోరి పలుమాఱుఁ బిశాచపుఁబాడెకట్టె! [1]నీ
    పలికిననోట దుమ్ముపడ! భావ్య మెఱుంగవు పెద్దలైనవా
    రల నిరసింతురా! ప్రెగరాణ్ణరసా! విరసా! తుసా! బుసా!

రాయల యాస్థానమున నప్పలాచార్యులను పండితకవి యొకఁడు కలఁడట! ఆతనిఁగూర్చి యొకరు—

శ్లో. అపశబ్దభయం నాస్తి అప్పలాచార్యసన్నిధౌ

రామకృష్ణుఁ డుత్తరార్ధమును వెంటనే యిట్లు పూరించె—

....అనాచారభయం నాస్తి తిష్టన్మూత్రస్య సన్నిధౌ.

రాయలయాస్థానముననే యొకనాఁడు బట్టుమూర్తికవి “కుంజరయూధంబు దోమకుత్తుక సొచ్చెన్” అన్న సమస్యఁ జెప్పి దీనిఁ బూరింపుఁ డని తక్కినకవుల నడిగెనఁట! రామకృష్ణుఁడు—

క. గంజాయి త్రాగి తురకల
    సంజాతులఁ గూడి కల్లు చవికొన్నావా?
    లంజెలకొడుకా యెక్కడ
    కుంజరయూథంబు దోమకుత్తుక సొచ్చెన్?

రాయలు కోపించి ‘యిదియా పూరణ’ మనెను. రామకృష్ణుఁడు ‘దేవా! పెద్దనాదిమహాకవుల కీ బట్టుకవి సమస్య నొసఁగువాఁడు! అతని కిట్టిపూరణమే పోలు’ ననెను. రాయలు ‘నేనొసఁగితిని పూరింపు’ మని యాగ్రహముతోనే పల్కెను. వెంటనే—

  1. ప్రయోగవైచిత్రి