పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి

145

దిద్దెదననియుఁ బ్రతిన పూనెను. రామకృష్ణుఁడు చిత్రోచ్చారణముతో నొకపద్యమున జదివెను. నరసరాజు వ్రాయలేక గింజులాడుకొని యెట్టకేల కిట్టు వ్రాసెను—
క. తృవ్వట బాబా తలపైఁ
    బువ్వట జాబిల్లి వల్వ బూచట చేఁదే
    బువ్వట చూడఁగను హుళు
    క్కవ్వట తలఁపంగ నిట్టి హరునకు జేజే!
ఇది వ్రాయుటకు రామకృష్ణకవి పద్యము చదివి కొంతసే పూరకుండవలసివచ్చెను. నరసరాజునకు వ్రాఁతబిరుదు పోయినది. రెండవపద్య మిట్లు చెప్పెను—
మ. గననీహారగు రామపద్మధళరంగత్కీర్తి చానూరమ
    ద్ధన శుక్రాక్షికళేభరాణ్మృగవతీ త్రైలోక్యధామోదరా
    యనఁగా శంకరవాంఛితార్థకృపదివ్యాస్తోకపాణీ జనా
    ర్థనవామేకపవైరివిగ్రహ ముకుంధా మిత్రవింధాధిపా!
నరసరాజు తననేర్పు వెల్లడి యగునట్లుగా ననేకదోషములను సంస్కరించి రామకృష్ణుని గేలిసేసెను. నిజముగా రామకృష్ణునియుచ్చారణప్రకార మాపద్యమున కర్థము కలదు. అందు దోషములు లేవు. సామాన్యబుద్ధికి దోషములుగాఁ గన్పట్టునట్లు రామకృష్ణుఁడు రచించెను. నరసరా జట్లే పొరఁబడెను. అంతట రామకృష్ణుఁడు లేచి యీక్రింది పద్యములఁ జెప్పి గెల్పుకొని నరసరాజును వంచించి పంపెను.
చ. ఒకనికవిత్వమం దెనయు నొప్పులు తప్పుల నావిత్వమం
    దొకనికిఁ దప్పుబట్టఁ బని యుండదు కాదని తప్పుపట్టినన్