138
చాటుపద్యమణిమంజరి
ఆంధ్రనైషధకర్త యంఘ్రియుగ్మంబునఁ
దగిలియుండెనుగదా నిగళయుగము
వీరభద్రారెడ్డివిద్వాంసుముంజేత
వియ్యమందెనుగదా వెదురుగొడియ
సార్వభౌమునిభుజాస్తంభ మెక్కెనుగదా
నగరివాకిటనుండు నల్లగుండు,
తే. కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయెఁ దిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేఱి మోసపోతి
నెట్టు చెల్లింతుఁ డంకంబు లేడునూర్లు.
అవసానకాలమున శ్రీనాథమహాకవిసార్వభౌముఁడు చెప్పికొన్న పద్యము—
సీ. కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి
రత్నాంబరంబు లేరాయఁ డిచ్చు?
రంభఁ గూడెఁ దెనుంగురాయరాహుత్తుండు
కస్తూరి కేరాజుఁ బ్రస్తుతింతు?
స్వర్గస్థుఁ డయ్యె విస్సనమంత్రి మఱి హేమ
పాత్రాన్న మెవ్వనిపంక్తిఁ గలదు?
కైలాసగిరిఁ బండె మైలారువిభుఁ డేగి
దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు?
తే. భాస్కరుఁడు మున్నె దేవునిపాలి కరిగెఁ
గలియుగంబున నిక నుండఁ గష్ట మనుచు
దివిజకవివరుగుండియల్ దిగ్గు రనఁగ
నరుగుచున్నాఁడు శ్రీనాథుఁ డమరపురికి.