102
చాటుపద్యరత్నాకరము
తమ్మడపు సెబాసుమంత్రి
ఉ. ...........................................................................నం
దమ్ము నిజమ్ము రమ్ము కవనమ్ము కవీ! రచియించిచూడమీ
దమ్వడాన్వయేందుని వదాన్యశిఖామణి మా సెబాసు మం
త్రి మ్మతిమంతునిం గనిన దివ్యదుకూలముతోడ గంధపు
ష్పమ్ము లవారితమ్ముగఁ గృపామతి నిచ్చుఁ గవీంద్రకోటికిన్.
ఉ. నందవరీకబృందమున నాటికి రాయనిభాస్కరుండు సొం
పొంది వదాన్యుఁ డంచుఁ బొలుపొందెను; నేటికి దమ్మడంపువం
శేందుఁ డరే! సెబాసనఁ బ్రసిద్ధి వహించెనుగా! సెబాసుమం
త్రీంద్రుఁడు మంత్రికోటులు నుతింప వదాన్యుఁ డనంగ ధారుణిన్.
ఉ. కాసులు కొన్ని కూర్చికొని గర్వముతో నపకీర్తిఁ బొందువా
రేసభ సన్నుతిం బడసి రెక్కడి కెక్కిరి దమ్మడంపుసే
బా సనిపించుకొన్నసచివప్రభు వీవె కదా? నియోగిలో
కాసమకీర్తిచే రవికులాంబుధిసోముఁడు రాముఁడుం బలెన్.
శా. ఏబోధల్ విని తల్లిదండ్రు లురుభూమీశాంఘ్రిపద్మంబులం
దేబిల్వావళు లుంచిరో? కవులు నేతీర్థావగాహాప్తులుం
గాఁ బొల్పారి హరి న్సపర్య లొకదీక్షాసక్తిఁ గావించిరో?
శాబాసయ్య జనించె దమ్మడపువశంబందుఁ బుణ్యాత్ముఁడై.
ఉ. మందమతిం గవుల్ ఖలుల మందుల గర్వుల దుష్టలోభిరా
డ్బృందము నెంచఁబోవుట వివేకులు గా రొకవేళఁ గాంచిన
న్నందవరీకులందు సుగుణాఢ్యుఁ డుదారుఁడు మాసెబాసుమం
త్రీంద్రుని గాంచినంతనె దరిద్రమతిభ్రమ లూడకుండునే?
ఉ. భాసురకీర్తిశాలి హరిభక్తవిభామతి దమ్మడంపుసే
బాసనుమంత్రికీర్తి రుచి భాసిలె దిగ్వనితాశిరోగ్రజా