పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

85

   ష్కృత మెప్పుడుఁ జేయను స
   మ్మతి లేని నరుండు మిగుల మన్నన నొందున్.

సమస్య:—అస్ఖలితబ్రహ్మచారి కార్గురుపుత్రుల్

క. ఈస్ఖావ్రాసము దుష్కర
   మస్ఖలనత నీయఁదగునె యది సుకవులకున్?
   సస్ఖలితలయి గుహుం గని
   రస్ఖలితబ్రహ్మచారి కార్గురుపుత్రుల్.

ఈరీతి సమస్యల నిచ్చి యిచ్చి తుదకేమియుఁ దోఁపక— ఇఱుకరాదు; కొఱుకరాదు; నఱుకరాదు; పెఱుకరాదు; అను నాల్గుపదములతోఁ బద్యముఁ జెప్పుమని కోరఁగా కవి—

గీ. ఇఱుకరాదుచేత నిసుమంత నిప్పైనఁ
   గొఱుకరాదు యినుము కొంచె మైన
   నఱుకరాదు నీరు నడిమికి రెండుగాఁ
   బెఱుకరాదు బావి పెల్లగిలఁగ.

అని పూరించెను. సమస్యలు పూర్తియైన పిమ్మట— “షా” యను నక్షరముతోఁ బ్రారంభించి, “క్షా” యను నక్షరముతో ముగించుచు నొక కొన్ని కందపద్యములు శ్రీరామస్తవముగా రచింపుఁడని రాజు గోర తత్క్షణమే వేంకనకవి యారీతి నొకశతకమే రచించెనఁట. కాని ప్రస్తుత మొక నాలుగుమాత్రమే ప్రచురింప నోచితిమి.