పుట:Chanpuramayanam018866mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

31


కారుం డై మృతి దప్పి యుప్పుకడలిం గాఁపయ్యె వార్ధీశకాం
తారత్నంబులు నీటిపాప యనుచుం దన్నట్టి యాడింపఁగన్.

91


క.

ఆహేళికులుం డనిమిష, బాహుళహిమకరణరాహుబాహుసుబాహున్
వాహారివాహగేహ, ప్రాహుణికుం జేసె ననలబాణప్రౌఢిన్.

92


మ.

విదితస్నేహము, సాధువంశము, గుణాన్వీతంబు, సత్పక్షమున్
హృదయగ్రాహిఫలంబు నై యొలయు నయ్యిక్ష్వాకురాట్ప్రేరిత
ప్రదకోత్తంసమువెంట నంటి చనియెన్ రాత్రించరప్రాణప
ఙ్క్తి దయం బాయఁగ లేనిమానవతిరీతిన్ రక్తభావాత్తయై.

93


చ.

నిజమఘపూర్తి దోఁప రజనీచరహారిణియై కకుత్స్థత
ల్లజుని వరించి యున్న జయలక్ష్మికి నొక్కసపత్నిఁ గూర్ప గా
ధిజమునిచంద్రుఁ డంతట విదేహమహీపరిణీపురోన్ముఖ
వ్రజనము చేకొనెం గృతము వర్ణవిపర్యయచర్యుఁ డెంచునే.

94


చ.

ముని రఘురాముతో నరిగి ముందట శోణతటానుబంధి చం
దనవనవాటి నాఁటిపయనంబు వసించి పయోధిరాజది
గ్వనజముఖీవినోదమణికందుకతన్ రవి చెంద సాంధ్యవం
దనముఖకృత్యము ల్నడిపి తజ్జ్ఞులగోష్ఠి మెలంగె నయ్యెడన్.

95


క.

ఈజనపదమున కధిపతి, యేజనపతియో మునీంద్ర యిది కృతయుగవ
ద్భ్రాజిత మని వెఱఁగందెడు, నాజితనూభవునితోడ యతివరుఁ డనియెన్.

96


సీ.

పౌరాభిమతచిత్ర బలసాంబుఁడు కుశాంబుఁడనఁగఁ గౌశాంబికి నధిపుఁ డొకఁడు
సరశరీరసృజనాభుఁడు కుశనాభుఁ డన మహెూదయమున కినుఁ డొకండు
దోశ్శక్తిశరజుఁ డౌధూతరజుఁడన ధర్మారణ్యపురికి నధ్యక్షుఁ డొకఁడు
నవనివిభావసుడు వసుండునా గిరివ్రజరాజధానికి రా జొకండు


గీ.

నైన వైధాత్రకుశరాజసూనులందు, వసువు పాలించు దేశ మీవసుధయందు
రల్ల కుశనాభుఁడు ఘృతాచివల్ల గనియె,నతను సైన్యాయితంబుఁ గన్యాశతంబు.

97


ఉ.

కిన్నెర మీటి వీణెఁ బలికించియుఁ దంబుఁఱబూని రక్తిగాఁ
దిన్ననిపాట పాడియును దేశియు మార్గము నింపు సొంపు నిం
ప న్నటియించియుం దివిరి మద్దెల వాచియుఁ బ్రొద్దువోక యా
కన్నెలు కేళికావని నొకానొకనాఁడు మెలంగి రయ్యెడన్.

98