పుట:Chanpuramayanam018866mbp.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెల్లంటివారును గూడఁ బూర్వపుసాళువరాజులబిరుదములఁ దమబిరుదములుగాఁ జేసికొన్నారు.

కసవరాజువంశము గ్రంథములో నిట్లు వర్ణింపబడినది. కరికాళచోళుని వంశములో సింగరిరాజు పుట్టెను. సింగరిరాజునకు శ్రీరంగరాజును, శ్రీరంగరాజునకు సింగరిరాజును, సింగరిరాజునకుఁ గావేరిరాజునుఁ, గావేరిరాజునకు సింగరిరాజును, సింగరిరాజునకుఁ గావేరిరాజునుఁ, గావేరిరాజునకుఁ గసవరాజు, సింగరిరాజు, తిరువేంగళరాజు, పెరుమాళ్రాజు ననునలువురు కొడుకులును బుట్టిరి. ఈకసవరాజే కృతిపతి. కసవరాజుపిదప నేడవతరమువాఁ డగుబ్రహ్మరాజు కాలమునఁ బుట్టిన [1]పద్మావతీపరిణయ మనుసంస్కృతచంపూగ్రంథ మీవంశక్రమమును దృఢపరుచుచున్నది. ఆగ్రంథములోఁ గసవరాజునకు మాఱు కేశవరా జనియున్నది. కసవయనునది కేశవశబ్దభవము కాఁబోలును. కసవరాజు తరువాతి తరములవారు పద్మావతీపరిణయములో నీరీతిం జెప్పఁబడినారు:—

కసవరాజు పిమ్మట నతనితమ్ముఁడైన వేంకటపెరుమాళ్రాజు రాజ్యము చేసెను. అతని యనంతర మాతని యన్నకొడు కగుబ్రహ్మరాజు రాజ్యము చేసెను. బ్రహ్మరాజుకొడుకులు కావేరిరాజు వేంకటపెరుమాళ్రాజులు. వేంకటపెరుమాళ్రాజు కొడుకు బ్రహ్మరాజు; అతని కొడుకులు కుమారవేంకటపెరుమాళ్రాజు, కావేరిరాజు, తిరుమలరాజు, సుందరకృష్ణరాజును. కుమారవేంకటపెరుమళ్రాజు కొడుకులు [2]బ్రహ్మరాజు మొదలగువారు. ఈబ్రహ్మరాజే పద్మావతీపరిణయకృతిపతి. కసవరాజునకు బ్రహ్మరాజునకు నడుమ నయిదుగురు రాజ్యముచేసినట్టులు దీనివలనఁ గనఁబడుచున్నది. ఈగ్రంథములోఁ గుమారవేంకటపెరుమాళ్రాజు తారణసంవత్సరచైత్రమాసములో లోకాంతరగతుఁ డైనట్లును, నాసంవత్సరజ్యేష్ఠమాసములో బ్రహ్మరాజు పట్టాభిషిక్తుఁ డైనట్టును బ్రహ్మరాజునాజ్ఞ ననుసరించి యాగ్రంథము వికృతిసంవత్సరమునం దచ్చుపడినట్లు నున్నది. తారణసంవత్సరము 1884-వ క్రైస్తవసంవత్సరమునకును, వికృతిసంవత్సరము 1890 సంవత్సరమునకును సరిపోవును. కుమారవేంకటపెరుమాళ్రాజు సవతితమ్ముఁ డగుతిరుమలరాజున కంకితమైనట్టియు, గరుడాద్రి సుబ్రహ్మణ్యవిద్వత్కవి ప్రణీత మైనట్టియు [3]శత్రుఘ్న

  1. ఈగ్రంథము కార్వేటినగరమునందలి శ్రీభారతీలీలాసదనముద్రాక్షరశాలలో నచ్చుపడినది.
  2. బ్రహ్మరాజునకు బొమ్మరాజని వాడుకపేరు. బ్రహ్మరాజుగారిపుత్రు లయినకుమారవేంకటపెరుమాళ్రాజు, కుమారస్వామిరాజుగార్లు ప్రస్తుతసంస్థానాధిపతులుగా నున్నారు.
  3. ఈగ్రంథము వ్రాఁతప్రతి యాంధ్రసాహిత్యపరిషత్పుస్తకభాండాగారమున నున్నది.