పుట:Chanpuramayanam018866mbp.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

107


మాయాసింహముకైవడిం గడువడి న్మమ్మారె! చించె న్నిజ
చ్ఛాయాగ్రాహిణి యైనసింహికచకాసన్మూర్తి నత్యుగ్రుఁ డై.

14


హనుమంతుఁడు సీతాన్వేషణమునకై చింతించుట

ఉ.

అంబుజబంధుతేజుఁ డగునాహనుమంతుఁడు వారిరాశిపా
రంబునుఁ జేరి లంబశిఖరంబున నిల్చి యనంతరంబ తీ
వ్రంబుగ లంకయుత్తరపువాకిటనుండియు ఖండితాంతరం
గంబునఁ జింతిలం దొణఁగెఁ గార్యసిసాధయిషాధురీణుఁ డై.

15


సీ.

కడచు నేకరణి శాఖామృగానీకంబు ప్రత్యూహకరము వారాకరంబుఁ
గడచుఁగా కేవీఁక వడిఁ బ్రవేశించు నీరజనీచరాధీశరాజధాని
గావున సర్వధా కడునిరర్థకమనోరథుఁ డౌఁ గదా పంక్తిరథకుమారుఁ
డదికాక యేను మహారౌద్ర మగునీసముద్రమ్ము దాఁటు టమోఘ మయ్యెఁ


గీ.

గటకట యెఱుంగ సకలలోకప్రతీత, సేమమున నున్నదియొ లేదొ భూమిజాత
యని తదన్వేషణార్థమై యాంజనేయుఁ, డరుణకిరణాస్తమయమాత్మ నభిలషించె.

16


క.

శతమఖనిక్షేప మహెూ, ద్ధతధనువునకుం బ్రయోజనావసర ముపా
గత మని పాశికిఁ దెలుపఁగ, ధృతిఁ జనుగతి భానుఁడుం బ్రతీచిం జేరెన్.

17


రాత్రివర్ణనము

సీ.

చరమాచలనితంబసంభవోజ్జ్వలదావపావకోత్కటశిఖాపాటలితమొ
నవిధార్కరశ్మివేష్టనభృతావలతటీసూర్యకాంతప్రభాశోణితంబొ
యాగంతుమిత్రపూజార్ఘ్యార్థవరుణోద్ధృతాంభోధిరత్నకాంత్యరుణితంబొ
ఖనదీరసగ్రహోగ్రత్వరాపరపయోరాశిబాడబహేతిరంజితంబొ


గీ.

యని జనులు డెందముల సందియంబు నొందఁ
గరము రాణించు సాంధ్యరాగంబు వలన
గగనభాగంబు కౌసుంభకంజరాగ
పల్లవజపాభిరూపమై యుల్లసిల్లె.

18


గీ.

క్షీరవారాశికన్యానికేతనములు, ముందుగా నత్తఱిని బీగముద్ర లయ్యె
వికచకుముదాళి మధుకరద్విజకులంబు, నవ్యమకరందభిక్షాటనం బొనర్చె.

19


మ.

నలుదిక్కు ల్ముదమంద వీవఁ దొడఁగె న్సంఫుల్లశేఫాలికా
కలికాకాషకషాయగంధవహము ల్గాఢాంధకారచ్ఛటా