పుట:Chandrika-Parinayamu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. తలచినకోరిక ల్గురియుదాని, మెఱుంగుమెఱుంగుమిన్నలం
దళతళమంచు మించుజిగిదాని, భరించినమాత్ర దేవకాం
తలఁ గికురించుసొం పెసఁగుదాని, నొకానొకరత్నమాలికన్
జలరుహలోచనామణి కొసంగె గిరీంద్రకుమారి యత్తఱిన్. 94

చ. మఱియు నమూల్యవాంఛితసమాజము లాదృతిచే ఘటించి యా
తెఱవఁ గవుంగిలించి నరదేవకుమారిక పోయి వత్తు ని
త్తఱి నని దెల్పి యాగిరిశతన్వి ముదంబున నేగె వేలుపుల్
తఱిగొని వెంట నొంద రజతక్షితిభృన్నిలయంబుఁ జేరఁగన్. 95

ఉ. అంత సుచంద్రమానవకులాగ్రణిచే క్షణదోదయక్షమా
కాంతునిచే బహూకృతులు గైకొని తత్సకలాంతరీపరా
ట్సంతతు లెల్ల నైజపురజాతముఁ జేరఁగ నేగె మానసా
భ్యంతరసీమఁ దచ్ఛుభమహావిభవోన్నతి సన్నుతించుచున్. 96

మ. అలపాంచాలవిభుండు పుత్త్రి కధికాంతావాసనూత్నప్రవే
శలసన్మంగళ మూన్పఁగాఁదలఁచి తత్సారంగదేశీయకుం
తలఁ దాఁ గౌఁగిటఁ జేర్చి యంకవసతిం దార్కొల్పి నవ్యాశ్రుసం
కులమై కన్గవ దోఁప నచ్చెలువఁ బల్కుం బ్రీతిచే నత్తఱిన్. 97

క. నిచ్చలు పుట్టినయింటికిఁ
జొచ్చినయింటికి నపూర్వశుభకీర్తితతుల్
హెచ్చ మెలంగవె తల్లి భ
వచ్చరితము భువనపుణ్యవైఖరిఁ బొదలన్. 98

సీ. వంశధర్మనిరూఢి వఱలించె నీనారి
మహితశాస్త్రాధిగమంబుకలిమి,
గురుతరులకు వన్నెగూరిచె నీశ్యామ
ఘనసుమనోవికసనముచేత,