పుట:Chandrika-Parinayamu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. నతి యొనర్చిన చెలువ కన్నగతనూజ
యపు డభీష్టార్థసంసిద్ధిరస్తటంచు
హాళి దీవించి కౌఁగిట నలమి కనక
మంగళాక్షతపాళికల్మౌళిఁ దార్చె. 42

వ. అంతఁ జతురంతయానంబున నాకాంతాశిరోమణి నుండ నియోగించి, యంచిత మనోంచలనిరా కుంచితప్రమదసమాజయై, యాగిరిరాజతనూజ సఖీజనంబులు వెనువెంట నడువ నెచ్చెలిచెలు వూని తత్పార్శ్వంబున నడచుచు, రాజసభముఖంబుఁ జేరి, యభంగమేరుశృంగంబులం దోఁచుసింగంపుఁ గొదమలతెఱంగునఁ గాంచనమంచనికాయంబులం జూపట్టు సకలాంతరీపానంతాకాంతలతాంతసాయక సంతానంబులం జూపి క్రమంబున నొక్కొక్కని దేశాదికంబులు దేటపడఁ జాతుర్యంబున నిట్లనియె. 43

పుష్కరద్వీపాధిపతి


మ. కనుఁగొంటే విరిగల్వకంటి మహితోత్కంఠాసముద్భూతి నీ
జననాథాగ్రణి నుజ్జ్వలాంఘ్రిసరసీజాతద్వయవ్యాప్తనూ
తనసామంతనృపచ్ఛటామకుటముక్తాకాంతిసూనోత్కరు
న్వినుతామర్త్యనికాయుఁ బుష్కరమహాద్వీపావనీపాలకున్. 44

మ. పరరాజప్రబలప్రభావహరణప్రౌఢస్థితిం బొల్చునీ
నరనాథోత్తమదోఃప్రతాపకుహనానాళీకమిత్రుండు దా
ధర నిర్మించుఁ జుమీ యమస్వస, మిళిందద్వేషిధమ్మిల్ల! త
త్పరమారాతివధూసకజ్జలదృగబ్జాతాంబుధారాగతిన్. 45

మ. అతులాంభోరుహపీఠిఁ బొల్పెసఁగు సత్యస్వామి కీ వి య్యిలా
పతితోడ న్రహిఁ బెండ్లిమ్రొక్కు ఘటియింపం జేర నీ కూన్చుఁ బో
యతఁ డాత్మేష్టఫలంబు లంతకయ ము న్నబ్జాక్షి యాత్రోవ నూ
ర్జితశాఖావళి సాఁచి వాని వటధాత్రీజాత మర్పింపఁగన్. 46