పుట:Chandrika-Parinayamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. స్తనమేరుస్థలవృత్తి నుబ్బు వళికాస్వర్ద్వీపినీభంగకు
ర్దనఁ జొక్కుం గను మధ్యనాకవిహృతిన్ రమ్యోరురంభోపగూ
హనలబ్ధిం జెలఁగు న్నృపేక్షణము లాహా చిత్ర మేణీవిలో
చనయాస్యేందుసుధైకసేవ ననిమేషత్వంబు సంధిల్లుటన్. 48

తే. ఉజ్జ్వలతరానురాగసంధ్యోదయంబు,
దగ మహాస్తంభభావంబు దాల్చినట్టి
పతిమనంబున నీరజాంబకుఁడు దోఁచె
నపుడు హరిరథసంలబ్ధి ననుసరించి. 49

చ. నిరుపమపద్మినీకులమణీపరిదర్శనశక్తి నైశ్చలీ
గరిమ భజించి సమ్మదవికాసమునం గనుపట్టుకుంభినీ
శ్వరతిలకంబు నుద్ధతి నిశాతపలాశసుమాంకుశంబుచేఁ
గర మసమాస్త్రయంత నఱకం జనియించె శిరశ్చలనస్థితుల్. 50

చ. అలరెడిశ్యామకెంజిగురుటాకులఁ జేరినఁ గోరకంబులన్
మలయుచు నున్నఁ జారుసుమమాలిక లొందిన మంజుమంజరీ
స్థలములపొందు గన్న మధుసంతతిఁ గూడినఁ బాయ వయ్యెడం
జెలఁగుటనో ద్విరేఫగతిచే మహిపాలకురమ్యనేత్రముల్. 51

తే. ఇట్లు తచ్చంద్రికాయత్తదృక్చకోరుఁ
డై రసాధీశపద్మాకుమారుఁ డపుడు
ప్రమదము, నవాద్భుతంబును బల్లవింప
నాత్మ నాయింతి నిట్లని యభినుతించె. 52

సీ. కాఁబోలు నీహేమగాత్రి క్రొత్తగ సానఁ
దీరిన వలఱేనిచారుహేతి,
కాఁబోలు నీకంబుకంఠి పాల్కడలిజి
డ్డడఁగఁ జూపట్టుశీతాంశురేఖ,